సంక్రాంతి వస్తున్న సినిమాలు మూడు పెద్ద హీరోలవే. వాటిలో రెండింటికి సంగీత దర్శకుడు తమనే. అయితే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ నుంచి ఇప్పటిదాకా విడుదలైన పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆహా ఓహో అంటూ ఎక్కడ చూసినా అవే వినిపించే స్థాయిలో రీచ్ ఇంకా తెచ్చుకోలేదు. రివర్స్ లో సంక్రాంతికి వస్తున్నాంకు భీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు మీద 50 మిలియన్లు దాటేసి టాప్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఇది ఒకరకంగా తమన్ కు షాకే. ఎందుకంటే బడ్జెట్ పరంగా పెద్దవైన బాలయ్య, చరణ్ కంటే వెంకీ మూవీకి హైప్ పెరగడం.
ఇప్పుడు తమన్ ముందు పలు సవాళ్లున్నాయి. మొదటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంటెంట్ నిలబెట్టడం. దర్శకుడు శంకర్ ఎలా రాబట్టుకుంటాడో కానీ ఆయన గతంలో ఏఆర్ రెహమాన్ తో చేయించుకున్న నేపధ్య సంగీతం ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచింది. వాటికి ధీటుగా గేమ్ ఛేంజర్ కోసం తమన్ ఎలా కంపోజ్ చేశాడనేది కీలకం. ఇక డాకు మహారాజ్ గురించి నాగవంశీ, బాబీ ఇస్తున్న హైప్ మాములుగా లేదు. ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు నుంచి పేపర్లు విసురుతూనే ఉంటారని తెగ ఊరిస్తున్నారు. ఇవి నిలబడాలంటే తమన్ స్కోర్ కీలకం. అఖండ, వీరసింహారెడ్డి బీజీఎమ్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్.
అటుపక్కేమో ఎలాంటి హడావిడి లేకుండా భీమ్స్ తనకొచ్చిన స్టార్ ఛాన్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. తొలి బ్రేక్ ధమాకాతోనే వచ్చినప్పటికీ ఆ తర్వాత గ్యాప్ వచ్చేసింది. సో 2025లో సంక్రాంతి వస్తున్నాం, మాస్ జాతరతో రెండు బ్లాక్ బస్టర్స్ పడ్డాయంటే టాప్ లీగ్ లోకి చేరిపోవచ్చు. అతని టార్గెట్ ఇదే. ఒకవేళ మ్యూజికల్ గా వెంకటేష్ సినిమా టాప్ లో నిలబడితే తమన్ మీద కామెంట్స్ వస్తాయి. సో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కు బెస్ట్ ఇవ్వాల్సిందే. హైప్ పరంగా మూడు సినిమాలు ఇంచుమించు ఒకే పడవలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. పుష్ప 2 హ్యాంగోవర్ చివరికి వచ్చేసింది కాబట్టి ఇక వీటి ప్రమోషన్లు ఊపందుకోవాలి.
This post was last modified on December 28, 2024 12:11 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…