ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్నాయన్న మాటే కానీ.. కొత్త సినిమాల విడుదల కష్టంగానే ఉంది. ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు పున:ప్రారంభం కాబోతుండగా.. ఒక్క పేరున్న సినిమా కూడా రిలీజ్ రేసులోకి రాలేదు. మామూలుగా అయితే సినిమాలకు మంచి డిమాండ్ ఉండే దసరా సీజన్ ఈసారి వెలవెలబోనుందని స్పష్టమవుతోంది.
కనీసం వచ్చే నెలలో దీపావళికి అయినా పరిస్థితులు బాగు పడి కొత్త, పెద్ద సినిమాలు రిలీజవుతాయన్న సంకేతాలు కనిపించడం లేదు. ఆ సీజన్ మీద కూడా సినీ పరిశ్రమ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆశలన్నీ తర్వాత వచ్చే క్రిస్మస్ సీజన్ మీదే. ఈ ఆశతోనే బాలీవుడ్లో ఒక పేరున్న సినిమాను ఆ సీజన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రమే.. 83.
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం, ఆయన నేతృత్వంలో భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడం.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మామూలు పరిస్థితుల్లో అయితే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. మధ్యలో దీని ఓటీటీ రిలీజ్ గురించి వార్తలొచ్చాయి కానీ.. చిత్ర బృందం ఆ ప్రచారాన్ని ఖండించింది. ఎప్పటికైనా థియేటర్లలోనే తమ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఆ మాటకు కట్టుబడి క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అప్పటికి థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో మామూలుగా నడుస్తాయని, జనాలు కూడా బాగానే థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. దీంతో పాటే థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తున్న మరో భారీ చిత్రం ‘సూర్యవంశీ’ని రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించారు. మరి ఈ చిత్రాలు అనుకున్న ప్రకారమే విడుదలవుతాయని ఆశిద్దాం.
This post was last modified on October 12, 2020 3:30 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…