ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్నాయన్న మాటే కానీ.. కొత్త సినిమాల విడుదల కష్టంగానే ఉంది. ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు పున:ప్రారంభం కాబోతుండగా.. ఒక్క పేరున్న సినిమా కూడా రిలీజ్ రేసులోకి రాలేదు. మామూలుగా అయితే సినిమాలకు మంచి డిమాండ్ ఉండే దసరా సీజన్ ఈసారి వెలవెలబోనుందని స్పష్టమవుతోంది.
కనీసం వచ్చే నెలలో దీపావళికి అయినా పరిస్థితులు బాగు పడి కొత్త, పెద్ద సినిమాలు రిలీజవుతాయన్న సంకేతాలు కనిపించడం లేదు. ఆ సీజన్ మీద కూడా సినీ పరిశ్రమ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆశలన్నీ తర్వాత వచ్చే క్రిస్మస్ సీజన్ మీదే. ఈ ఆశతోనే బాలీవుడ్లో ఒక పేరున్న సినిమాను ఆ సీజన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రమే.. 83.
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం, ఆయన నేతృత్వంలో భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడం.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మామూలు పరిస్థితుల్లో అయితే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. మధ్యలో దీని ఓటీటీ రిలీజ్ గురించి వార్తలొచ్చాయి కానీ.. చిత్ర బృందం ఆ ప్రచారాన్ని ఖండించింది. ఎప్పటికైనా థియేటర్లలోనే తమ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఆ మాటకు కట్టుబడి క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అప్పటికి థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో మామూలుగా నడుస్తాయని, జనాలు కూడా బాగానే థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. దీంతో పాటే థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తున్న మరో భారీ చిత్రం ‘సూర్యవంశీ’ని రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించారు. మరి ఈ చిత్రాలు అనుకున్న ప్రకారమే విడుదలవుతాయని ఆశిద్దాం.
This post was last modified on October 12, 2020 3:30 pm
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…