ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకులు భావిస్తే వాటిని ఓటిటి లేదా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ ముచ్చట తీర్చుకుంటారు. కానీ అదే పనిగా ఆడియన్స్ డిమాండ్ చేసే సందర్భాలు తక్కువగా ఉంటాయి. సత్యం సుందరం అలాంటి అరుదైన కోవలోకి వస్తోంది. విడుదలైన టైంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు. తెలుగు తమిళం నయం కానీ ఇతర భాషల్లో డిజాస్టర్ అనిపించుకుంది. తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే సత్యం సుందరంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ కట్ చేసిన 18 నిమిషాలను తర్వాత జోడించమని చాలా మంది ఒత్తిడి చేశారు. కనీసం మూడో వారం నుంచైనా పెట్టొచ్చు కదాని ఫోన్లు, మెసేజ్ లు చేశారు. ఓటిటిలో వచ్చాక ఇంత మంచి చిత్రం మిస్ అయినందుకు బాధ పడుతున్నామని, గూగుల్ పేలో డబ్బులు వేసి నిర్మాతకు పంపమని అడిగారు. దీంతో షాక్ తినడం ప్రేమ్ కుమార్ వంతయ్యింది. అదేదో వాళ్ళందరూ థియేటర్లకు వచ్చి చూసి ఉంటే కమర్షియల్ గానూ సత్యం సుందరం స్కేల్ పెరిగేది కదా. డిజిటల్ లో చూశాక ఆహా ఓహో అంటే లాభం ఏముంటుంది. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో ఆయనే పంచుకున్నారు.
దీని సంగతలా ఉంచితే ప్రేమ్ కుమార్ కు చాలా పేరు తీసుకొచ్చిన 96 సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ముప్పాతిక భాగం పూర్తి చేశారు. విజయ్ సేతుపతి, త్రిషలే కొనసాగుతారా లేక ఇంకో కొత్త జంటను తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే 96ని తెలుగులో శర్వానంద్, సమంతలతో జానుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తారనే పేరున్న ఈ విలక్షణ దర్శకుడు 96 టూలో ఏం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ మాత్రమే వస్తుందేమో.
This post was last modified on December 26, 2024 2:49 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…