ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకులు భావిస్తే వాటిని ఓటిటి లేదా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ ముచ్చట తీర్చుకుంటారు. కానీ అదే పనిగా ఆడియన్స్ డిమాండ్ చేసే సందర్భాలు తక్కువగా ఉంటాయి. సత్యం సుందరం అలాంటి అరుదైన కోవలోకి వస్తోంది. విడుదలైన టైంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు. తెలుగు తమిళం నయం కానీ ఇతర భాషల్లో డిజాస్టర్ అనిపించుకుంది. తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే సత్యం సుందరంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ కట్ చేసిన 18 నిమిషాలను తర్వాత జోడించమని చాలా మంది ఒత్తిడి చేశారు. కనీసం మూడో వారం నుంచైనా పెట్టొచ్చు కదాని ఫోన్లు, మెసేజ్ లు చేశారు. ఓటిటిలో వచ్చాక ఇంత మంచి చిత్రం మిస్ అయినందుకు బాధ పడుతున్నామని, గూగుల్ పేలో డబ్బులు వేసి నిర్మాతకు పంపమని అడిగారు. దీంతో షాక్ తినడం ప్రేమ్ కుమార్ వంతయ్యింది. అదేదో వాళ్ళందరూ థియేటర్లకు వచ్చి చూసి ఉంటే కమర్షియల్ గానూ సత్యం సుందరం స్కేల్ పెరిగేది కదా. డిజిటల్ లో చూశాక ఆహా ఓహో అంటే లాభం ఏముంటుంది. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో ఆయనే పంచుకున్నారు.
దీని సంగతలా ఉంచితే ప్రేమ్ కుమార్ కు చాలా పేరు తీసుకొచ్చిన 96 సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ముప్పాతిక భాగం పూర్తి చేశారు. విజయ్ సేతుపతి, త్రిషలే కొనసాగుతారా లేక ఇంకో కొత్త జంటను తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే 96ని తెలుగులో శర్వానంద్, సమంతలతో జానుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తారనే పేరున్న ఈ విలక్షణ దర్శకుడు 96 టూలో ఏం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ మాత్రమే వస్తుందేమో.
This post was last modified on December 26, 2024 2:49 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…