‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ.. ‘జై లవకుశ’తో పుంజుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేసిన ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్ వల్ల ఇబ్బందులు పడ్డానని అతను వ్యాఖ్యానించాడు. ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడని బాబీ.. అది హిట్ అయినప్పటికీ, ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పాడు. తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్గా సినిమా తీసి ఉంటే దాని రేంజే వేరుగా ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు. ఇంతకీ బాబీ ఏ సినిమా గురించి అలా మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఐతే ఇందుకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనిపించడం లేదు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే.. ఆ సినిమా ‘జై లవకుశ’ అని తేల్చేస్తున్నారు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ గురించే బాబీ మాట్లాడాడని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మధ్య నందమూరి అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘దేవర’ నిర్మాణ విలువల విషయంలో విమర్శలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ ఏమో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పోల్చాడీ సినిమాను.
కానీ సినిమాలో ఆ స్థాయి క్వాలిటీ కనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్లు లేవంటూ తారక్ ఫ్యాన్సే తిట్టిపోశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో, ఆ తర్వాత ఓటీటీలో వచ్చినపుడు ఈ విషయమై ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయి. ‘జై లవకుశ’ విషయంలో బాబీ బాధ పడడంలో తప్పేమీ లేదని.. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్లు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడడం మామూలే అని.. ఇక నుంచైనా సినిమాలు తీసినపుడు గ్రాండ్గా, మంచి క్వాలిటీతో తీయడం మంచిదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on December 25, 2024 7:45 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…