‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ.. ‘జై లవకుశ’తో పుంజుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేసిన ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్ వల్ల ఇబ్బందులు పడ్డానని అతను వ్యాఖ్యానించాడు. ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడని బాబీ.. అది హిట్ అయినప్పటికీ, ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పాడు. తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్గా సినిమా తీసి ఉంటే దాని రేంజే వేరుగా ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు. ఇంతకీ బాబీ ఏ సినిమా గురించి అలా మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఐతే ఇందుకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనిపించడం లేదు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే.. ఆ సినిమా ‘జై లవకుశ’ అని తేల్చేస్తున్నారు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ గురించే బాబీ మాట్లాడాడని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మధ్య నందమూరి అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘దేవర’ నిర్మాణ విలువల విషయంలో విమర్శలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ ఏమో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పోల్చాడీ సినిమాను.
కానీ సినిమాలో ఆ స్థాయి క్వాలిటీ కనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్లు లేవంటూ తారక్ ఫ్యాన్సే తిట్టిపోశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో, ఆ తర్వాత ఓటీటీలో వచ్చినపుడు ఈ విషయమై ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయి. ‘జై లవకుశ’ విషయంలో బాబీ బాధ పడడంలో తప్పేమీ లేదని.. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్లు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడడం మామూలే అని.. ఇక నుంచైనా సినిమాలు తీసినపుడు గ్రాండ్గా, మంచి క్వాలిటీతో తీయడం మంచిదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…