నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత ఏడాది అక్టోబరు తొలి వారంలో విడుదలైంది. సూపర్ హిట్ అయిన ఆ సినిమా తర్వాత నవీన్ ఇప్పటిదాకా కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. మధ్యలో యాక్సిడెంట్ వల్ల అతను చాన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ మధ్యే మళ్లీ ఫిట్గా తయారై బాలయ్య షో ‘అన్స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇక తన నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుందని చూస్తుండగా.. ఈ రోజు పెద్ద షాకిచ్చాడు.
ఎప్పుడో 2022 ఆరంభంలో అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని కొత్త చిత్రంగా ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్ వదిలింది టీం. ప్రి వెడ్డింగ్ టీజర్ పేరుతో రిలీజ్ చేసిన ప్రోమో ఇంట్రెస్టింగ్గానే ఉంది. రేపట్నుంచి పెళ్లి సందడి మొదలు అని ఇందులో పేర్కొన్నారు. ఐతే ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రి వెడ్డింగ్ టీజర్లో ఎక్కడా దర్శకుడి పేరు కనిపించలేదు. హీరో, నిర్మాతల పేర్లు మాత్రమే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో. ఇదే తన తొలి చిత్రం కావాల్సింది. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలో ఆపేశారని వార్తలు వచ్చాయి. రెండేళ్లకు పైగా ఈ సినిమా వార్తల్లో లేదు. దీన్ని పక్కన పెట్టే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేశాడు నవీన్. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకున్నాక ఇంకేదో కొత్తది, పెద్ద సినిమాను నవీన్ లైన్లో పెడతాడని అనుకున్నారు. కానీ అతను తిరిగి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు. ఇలా పక్కన పెట్టిన సినిమాను మళ్లీ లైన్లో పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకరే రూపొందించబోతున్నాడా.. తెరపైకి కొత్త దర్శకుడు రాబోతున్నాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 25, 2024 5:44 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…