నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత ఏడాది అక్టోబరు తొలి వారంలో విడుదలైంది. సూపర్ హిట్ అయిన ఆ సినిమా తర్వాత నవీన్ ఇప్పటిదాకా కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. మధ్యలో యాక్సిడెంట్ వల్ల అతను చాన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ మధ్యే మళ్లీ ఫిట్గా తయారై బాలయ్య షో ‘అన్స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇక తన నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుందని చూస్తుండగా.. ఈ రోజు పెద్ద షాకిచ్చాడు.
ఎప్పుడో 2022 ఆరంభంలో అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని కొత్త చిత్రంగా ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్ వదిలింది టీం. ప్రి వెడ్డింగ్ టీజర్ పేరుతో రిలీజ్ చేసిన ప్రోమో ఇంట్రెస్టింగ్గానే ఉంది. రేపట్నుంచి పెళ్లి సందడి మొదలు అని ఇందులో పేర్కొన్నారు. ఐతే ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రి వెడ్డింగ్ టీజర్లో ఎక్కడా దర్శకుడి పేరు కనిపించలేదు. హీరో, నిర్మాతల పేర్లు మాత్రమే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో. ఇదే తన తొలి చిత్రం కావాల్సింది. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలో ఆపేశారని వార్తలు వచ్చాయి. రెండేళ్లకు పైగా ఈ సినిమా వార్తల్లో లేదు. దీన్ని పక్కన పెట్టే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేశాడు నవీన్. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకున్నాక ఇంకేదో కొత్తది, పెద్ద సినిమాను నవీన్ లైన్లో పెడతాడని అనుకున్నారు. కానీ అతను తిరిగి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు. ఇలా పక్కన పెట్టిన సినిమాను మళ్లీ లైన్లో పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకరే రూపొందించబోతున్నాడా.. తెరపైకి కొత్త దర్శకుడు రాబోతున్నాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 25, 2024 5:44 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…