సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పుష్ప టీం తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నామని అల్లు అరవింద్ తెలిపారు.
ఆ రూ.2 కోట్లలో రూ. కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్, రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే రూ.2 కోట్ల చెక్ ను టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, దిల్ రాజులతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ ఈ రోజు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు సానుకూలంగా చెప్పారని అన్నారు.
శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మన అందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నానని తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఈ క్రమంలోనే శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం పుష్ప టీం తరఫు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేశామని చెప్పారు.
This post was last modified on December 25, 2024 3:36 pm
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…