Movie News

రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పుష్ప టీం తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నామని అల్లు అరవింద్ తెలిపారు.

ఆ రూ.2 కోట్లలో రూ. కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్, రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే రూ.2 కోట్ల చెక్ ను టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, దిల్ రాజులతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ ఈ రోజు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు సానుకూలంగా చెప్పారని అన్నారు.

శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మన అందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నానని తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఈ క్రమంలోనే శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం పుష్ప టీం తరఫు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేశామని చెప్పారు.

This post was last modified on December 25, 2024 3:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…

19 minutes ago

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

4 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

4 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

9 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

11 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

14 hours ago