సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పుష్ప టీం తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నామని అల్లు అరవింద్ తెలిపారు.
ఆ రూ.2 కోట్లలో రూ. కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్, రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే రూ.2 కోట్ల చెక్ ను టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, దిల్ రాజులతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ ఈ రోజు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు సానుకూలంగా చెప్పారని అన్నారు.
శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మన అందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నానని తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఈ క్రమంలోనే శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం పుష్ప టీం తరఫు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేశామని చెప్పారు.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…