Movie News

రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పుష్ప టీం తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నామని అల్లు అరవింద్ తెలిపారు.

ఆ రూ.2 కోట్లలో రూ. కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్, రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే రూ.2 కోట్ల చెక్ ను టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, దిల్ రాజులతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ ఈ రోజు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు సానుకూలంగా చెప్పారని అన్నారు.

శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మన అందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నానని తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఈ క్రమంలోనే శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం పుష్ప టీం తరఫు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేశామని చెప్పారు.

This post was last modified on December 25, 2024 3:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

38 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago