Movie News

పెళ్ళాం డబ్బులతో బతికిన నటుడు?

తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు హీరోగా చేసినా ఆ తరువాత కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా చేయలేని పరిస్థితి. పెళ్ళాం డబ్బులతో పదేళ్ళ పాటు గడిపాడు. కొడుకు నుంచి కూడా ‘నాన్న ఇక సినిమాలు చేయరా? డబ్బులు సంపాదించారా?’ అనే సందేహలు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నరకంగా ఉంటుంది. ఆ విధమైన చేదు అనుభవాలను ఎదుర్కొన్న నటుడు బాబీ డియోల్.

అలాంటి నటుడికి ఒక తెలుగోడు ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమాల్ సినిమాతో బాబీ తలరాతే మారిపోయింది. 15 ఏళ్ళు ఇంట్లోనే గడిపిన బాబీ జీవితం ఆ ఒక్క సినిమాతో బిజీబిజీగా మారిపోయింది. అందుకే ఇప్పుడు అతను ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. డాకు మహరాజ్ లో కూడా విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అతని గురించి ఇలాంటి విషయాలను ఆ చిత్ర దర్శకుడు బాబీ(KS రవీంద్ర) తెలియజేశాడు.

బాబీ డియోల్ సందీప్ పేరు చెబితేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నారట. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా చేసినప్పటికి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. ఫొటోలు పంపిస్తే అద్భుతంగా ఉన్నాయి అనే వారే కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట. కానీ ఒక తెలుగోడు వచ్చి తన లైఫ్ ను మార్చేసినట్లు బాబీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నట్లు దర్శకుడు రవీంద్ర ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అంతే కాకుండా అతనికి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

This post was last modified on December 25, 2024 2:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago