తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు హీరోగా చేసినా ఆ తరువాత కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా చేయలేని పరిస్థితి. పెళ్ళాం డబ్బులతో పదేళ్ళ పాటు గడిపాడు. కొడుకు నుంచి కూడా ‘నాన్న ఇక సినిమాలు చేయరా? డబ్బులు సంపాదించారా?’ అనే సందేహలు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నరకంగా ఉంటుంది. ఆ విధమైన చేదు అనుభవాలను ఎదుర్కొన్న నటుడు బాబీ డియోల్.
అలాంటి నటుడికి ఒక తెలుగోడు ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమాల్ సినిమాతో బాబీ తలరాతే మారిపోయింది. 15 ఏళ్ళు ఇంట్లోనే గడిపిన బాబీ జీవితం ఆ ఒక్క సినిమాతో బిజీబిజీగా మారిపోయింది. అందుకే ఇప్పుడు అతను ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. డాకు మహరాజ్ లో కూడా విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అతని గురించి ఇలాంటి విషయాలను ఆ చిత్ర దర్శకుడు బాబీ(KS రవీంద్ర) తెలియజేశాడు.
బాబీ డియోల్ సందీప్ పేరు చెబితేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నారట. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా చేసినప్పటికి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. ఫొటోలు పంపిస్తే అద్భుతంగా ఉన్నాయి అనే వారే కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట. కానీ ఒక తెలుగోడు వచ్చి తన లైఫ్ ను మార్చేసినట్లు బాబీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నట్లు దర్శకుడు రవీంద్ర ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అంతే కాకుండా అతనికి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…