న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా తర్వాత మరో వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సరిపోదా శనివారం ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పనక్కర్లేదు. హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీ తర్వాత మళ్ళీ మాస్ ని టార్గెట్ చేసుకుని నాని సాధించిన విజయం అభిమానులకు మాములు కిక్ ఇవ్వలేదు. దీన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ రిపోర్ట్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సాటర్డే స్టార్ టైటిల్ తో రూపొందిస్తారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ డివివి దగ్గర హక్కులకు సంబంధించిన వ్యవహారం నడుస్తోందట. అయితే ఇది అవసరమాని అడిగేందుకు లాజిక్ ఉంది.
సరిపోదా శనివారం ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ తో సహా అందుబాటులో ఉంది. కొన్ని కోట్ల మంది చూసేశారు. తిరిగి అదే కథని మళ్ళీ చూపిస్తే ఎలా అనేది విశ్లేషకుల కామెంట్. గతంలో కార్తీక్ ఆర్యన్ ఇదే తరహాలో ఎంతో ముచ్చట పడి అల వైకుంఠపురములో రీమేక్ చేశాడు. అది దారుణంగా డిజాస్టరయ్యింది. కనీసం ఏవరేజ్ కూడా కాలేదు. అంతకు ముందు షాహిద్ కపూర్ జెర్సీ, రాజ్ కుమార్ రావు హిట్ 1 ది ఫస్ట్ కేస్ లాంటివి ఊసులో లేనంతగా పోయాయి. వీటిలో కొన్ని ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన తెలుగు దర్శకులే తీసినప్పటికి నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు.
మరి నాని మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. భూల్ భూలయ్యా 3తో ఇటీవలే మంచి విజయం సాధించిన కార్తీక్ ఆర్యన్ రీమేకులు కూడా స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువగా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా తెలుగు తమిళ హిట్లని రీమేక్ చేయడం కంటే ఇక్కడి దర్శకులతో ప్యాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేయడం ఎక్కువ లాభదాయకమని హిందీ స్టార్లు గుర్తించాల్సిన విషయం. షారుఖ్ ఖాన్ అలా చేసే జవాన్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అయినా రీమేకులతో షాక్ మీద షాక్ తింటున్న అక్షయ్ కుమార్ ని ఉదాహరణగా తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.
This post was last modified on December 24, 2024 7:03 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…