Movie News

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్టయి మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ, సీఐల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు తర్వాత అల్లు అర్జున్ విచారణ ముగిసింది.

విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మీడియాతో పాటు ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ తన కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నారు. విచారణ సందర్భంగా దాదాపుగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. కేసు విచారణలో ఉండగా బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.

కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వీటి మీద పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటకు ఆంటోనీ ప్రథమ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్, ఆంటోనీలను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేయాలని తొలుత పోలీసులు భావించారని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ దగ్గరకు బన్నీ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని, మరోసారి తొక్కిసలాట జరిగే అవకాశమున్న నేపథ్యంలో మరో రోజుకు ఆ ఎపిసోడ్ ను పోలీసులు వాయిదా వేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ కు తెల్లటి పరదాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓయూ జేఏసీ రాళ్ల దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 24, 2024 3:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

3 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

3 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

5 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

6 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

7 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

7 hours ago