Movie News

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్టయి మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ, సీఐల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు తర్వాత అల్లు అర్జున్ విచారణ ముగిసింది.

విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మీడియాతో పాటు ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ తన కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నారు. విచారణ సందర్భంగా దాదాపుగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. కేసు విచారణలో ఉండగా బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.

కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వీటి మీద పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటకు ఆంటోనీ ప్రథమ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్, ఆంటోనీలను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేయాలని తొలుత పోలీసులు భావించారని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ దగ్గరకు బన్నీ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని, మరోసారి తొక్కిసలాట జరిగే అవకాశమున్న నేపథ్యంలో మరో రోజుకు ఆ ఎపిసోడ్ ను పోలీసులు వాయిదా వేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ కు తెల్లటి పరదాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓయూ జేఏసీ రాళ్ల దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 24, 2024 3:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

20 minutes ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

1 hour ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

4 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

5 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

8 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

9 hours ago