Movie News

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్టయి మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ, సీఐల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు తర్వాత అల్లు అర్జున్ విచారణ ముగిసింది.

విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మీడియాతో పాటు ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ తన కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నారు. విచారణ సందర్భంగా దాదాపుగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. కేసు విచారణలో ఉండగా బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.

కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వీటి మీద పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటకు ఆంటోనీ ప్రథమ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్, ఆంటోనీలను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేయాలని తొలుత పోలీసులు భావించారని తెలుస్తోంది.

అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ దగ్గరకు బన్నీ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని, మరోసారి తొక్కిసలాట జరిగే అవకాశమున్న నేపథ్యంలో మరో రోజుకు ఆ ఎపిసోడ్ ను పోలీసులు వాయిదా వేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ కు తెల్లటి పరదాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓయూ జేఏసీ రాళ్ల దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 24, 2024 3:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

35 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago