దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేస్తున్నా.. ముందే కథ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చేస్తాడు. ఈగ లాంటి కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పి సినిమా మొదలుపెట్టిన ఘనుడు జక్కన్న. తన కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ప్రేక్షకులకు చాలా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా చిత్రీకరణ ఆరంభ దశలో దశలో ఉండగా.. ఎన్టీఆర్, చరణ్ల పాత్రల గురించి క్లియర్ కట్గా చెప్పేశాడు జక్కన్న.
ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్ర చేస్తుంటే.. చరణ్ సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. వాస్తవంగా వీళ్లిద్దరూ జీవించిన కాలాలు వేరు. వాళ్లెప్పుడూ కలవలేదు కూడా. కానీ వాళ్లు కలిసినట్లు.. అలా కలిశాకే వారి జీవితాలు మారినట్లు ఒక కల్పిత కథను చెప్పనున్నట్లు రాజమౌళి స్పష్టత ఇచ్చాడు.సినిమాలో పెద్దగా దేశభక్తి కోణం ఉండదని, ఇది ఫక్తు కమర్షియల్ కోణంలో సాగుతుందని కూడా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
ఐతే జక్కన్న అంత క్లియర్గా చెప్పినప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో గురించి స్పందిస్తూ.. సినిమాలో సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి బ్రిటిష్ వారిపై పోరాడతారన్నట్లుగా వ్యాఖ్యానించాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి సమాధానం వచ్చింది.
సీతారామరాజు, భీమ్ సినిమాలో కలిసే మాట వాస్తవమే అని.. కానీ వాళ్లిద్దరూ స్వతంత్ర పోరాటం లాంటిదేమీ చేయరని.. అన్నింటికీ మించి ఇది అసలు దేశభక్తి సినిమా కాదని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఈ తరహా అంచనాలు పెట్టుకుని వస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారేమో అని జక్కన్న అండ్ కో భయపడుతున్నట్లుంది. అందుకే దేశభక్తి కోణాన్ని ముందు నుంచి కొట్టిపారేస్తోంది. తమది ఫక్తు కల్పిత, కమర్షియల్ కథ అని నొక్కి వక్కాణిస్తోంది.
This post was last modified on October 12, 2020 11:25 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…