దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేస్తున్నా.. ముందే కథ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చేస్తాడు. ఈగ లాంటి కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పి సినిమా మొదలుపెట్టిన ఘనుడు జక్కన్న. తన కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ప్రేక్షకులకు చాలా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా చిత్రీకరణ ఆరంభ దశలో దశలో ఉండగా.. ఎన్టీఆర్, చరణ్ల పాత్రల గురించి క్లియర్ కట్గా చెప్పేశాడు జక్కన్న.
ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్ర చేస్తుంటే.. చరణ్ సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. వాస్తవంగా వీళ్లిద్దరూ జీవించిన కాలాలు వేరు. వాళ్లెప్పుడూ కలవలేదు కూడా. కానీ వాళ్లు కలిసినట్లు.. అలా కలిశాకే వారి జీవితాలు మారినట్లు ఒక కల్పిత కథను చెప్పనున్నట్లు రాజమౌళి స్పష్టత ఇచ్చాడు.సినిమాలో పెద్దగా దేశభక్తి కోణం ఉండదని, ఇది ఫక్తు కమర్షియల్ కోణంలో సాగుతుందని కూడా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
ఐతే జక్కన్న అంత క్లియర్గా చెప్పినప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో గురించి స్పందిస్తూ.. సినిమాలో సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి బ్రిటిష్ వారిపై పోరాడతారన్నట్లుగా వ్యాఖ్యానించాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి సమాధానం వచ్చింది.
సీతారామరాజు, భీమ్ సినిమాలో కలిసే మాట వాస్తవమే అని.. కానీ వాళ్లిద్దరూ స్వతంత్ర పోరాటం లాంటిదేమీ చేయరని.. అన్నింటికీ మించి ఇది అసలు దేశభక్తి సినిమా కాదని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఈ తరహా అంచనాలు పెట్టుకుని వస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారేమో అని జక్కన్న అండ్ కో భయపడుతున్నట్లుంది. అందుకే దేశభక్తి కోణాన్ని ముందు నుంచి కొట్టిపారేస్తోంది. తమది ఫక్తు కల్పిత, కమర్షియల్ కథ అని నొక్కి వక్కాణిస్తోంది.
This post was last modified on October 12, 2020 11:25 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…