మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు వీరిలో ఒక హీరోతో సినిమా చేసి హిట్ కొడితే.. అదే దర్శకుడు తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తారు. బాబీ కొల్లికి కూడా ఇప్పుడు అదే సవాలు ఎదురవుతోంది. అతను మెగాస్టార్తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో చిరుకు ఇదే అతి పెద్ద విజయం.
ఇప్పుడు బాబీ.. బాలయ్యతో చేసిన ‘డాకు మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ గత సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయితే.. ‘డాకు మహారాజ్’ కూడా అదే పండుగ సీజన్లో విడుదల కానుంది. కాబట్టి చిరు సినిమా కంటే వసూళ్లు ఇంకా ఎక్కువ రావాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నిర్మాత నాగవంశీ సినిమా మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ బాబీ చిరంజీవి గారితో చేసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ బెటర్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇది బాగుంటుందా అని ఓ విలేకరి బాబీని అడిగారు.
దీనికి బాబీ జవాబు చెప్పడానికి ముందే నాగవంశీ అందుకున్నాడు. ‘‘బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. నేను బాలయ్య గారి అభిమానిని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే ఓ విషయం చెబుతా. ఆ సినిమా కంటే ఈ సినిమాను చాలా బాగా తీశాడు బాబీ. ఈ సినిమా కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి చెబుతున్నా. కాబట్టి దాని కంటే ‘డాకు మహారాజ్’ ఇంకా బాగుంటుంది. రేప్పొద్దున థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే మాట చెబుతారు’’ అని నాగవంశీ అన్నాడు. మరి వంశీ చెప్పినంత గొప్పగా ‘డాకు మహారాజ్’ ఉంటుందేమో చూడాలి.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…