మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు వీరిలో ఒక హీరోతో సినిమా చేసి హిట్ కొడితే.. అదే దర్శకుడు తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తారు. బాబీ కొల్లికి కూడా ఇప్పుడు అదే సవాలు ఎదురవుతోంది. అతను మెగాస్టార్తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో చిరుకు ఇదే అతి పెద్ద విజయం.
ఇప్పుడు బాబీ.. బాలయ్యతో చేసిన ‘డాకు మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ గత సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయితే.. ‘డాకు మహారాజ్’ కూడా అదే పండుగ సీజన్లో విడుదల కానుంది. కాబట్టి చిరు సినిమా కంటే వసూళ్లు ఇంకా ఎక్కువ రావాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నిర్మాత నాగవంశీ సినిమా మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ బాబీ చిరంజీవి గారితో చేసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ బెటర్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇది బాగుంటుందా అని ఓ విలేకరి బాబీని అడిగారు.
దీనికి బాబీ జవాబు చెప్పడానికి ముందే నాగవంశీ అందుకున్నాడు. ‘‘బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. నేను బాలయ్య గారి అభిమానిని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే ఓ విషయం చెబుతా. ఆ సినిమా కంటే ఈ సినిమాను చాలా బాగా తీశాడు బాబీ. ఈ సినిమా కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి చెబుతున్నా. కాబట్టి దాని కంటే ‘డాకు మహారాజ్’ ఇంకా బాగుంటుంది. రేప్పొద్దున థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే మాట చెబుతారు’’ అని నాగవంశీ అన్నాడు. మరి వంశీ చెప్పినంత గొప్పగా ‘డాకు మహారాజ్’ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on December 23, 2024 4:08 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…