మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు వీరిలో ఒక హీరోతో సినిమా చేసి హిట్ కొడితే.. అదే దర్శకుడు తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తారు. బాబీ కొల్లికి కూడా ఇప్పుడు అదే సవాలు ఎదురవుతోంది. అతను మెగాస్టార్తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో చిరుకు ఇదే అతి పెద్ద విజయం.
ఇప్పుడు బాబీ.. బాలయ్యతో చేసిన ‘డాకు మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ గత సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయితే.. ‘డాకు మహారాజ్’ కూడా అదే పండుగ సీజన్లో విడుదల కానుంది. కాబట్టి చిరు సినిమా కంటే వసూళ్లు ఇంకా ఎక్కువ రావాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నిర్మాత నాగవంశీ సినిమా మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ బాబీ చిరంజీవి గారితో చేసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ బెటర్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇది బాగుంటుందా అని ఓ విలేకరి బాబీని అడిగారు.
దీనికి బాబీ జవాబు చెప్పడానికి ముందే నాగవంశీ అందుకున్నాడు. ‘‘బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. నేను బాలయ్య గారి అభిమానిని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే ఓ విషయం చెబుతా. ఆ సినిమా కంటే ఈ సినిమాను చాలా బాగా తీశాడు బాబీ. ఈ సినిమా కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి చెబుతున్నా. కాబట్టి దాని కంటే ‘డాకు మహారాజ్’ ఇంకా బాగుంటుంది. రేప్పొద్దున థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే మాట చెబుతారు’’ అని నాగవంశీ అన్నాడు. మరి వంశీ చెప్పినంత గొప్పగా ‘డాకు మహారాజ్’ ఉంటుందేమో చూడాలి.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…