మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు వీరిలో ఒక హీరోతో సినిమా చేసి హిట్ కొడితే.. అదే దర్శకుడు తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తారు. బాబీ కొల్లికి కూడా ఇప్పుడు అదే సవాలు ఎదురవుతోంది. అతను మెగాస్టార్తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్లో చిరుకు ఇదే అతి పెద్ద విజయం.
ఇప్పుడు బాబీ.. బాలయ్యతో చేసిన ‘డాకు మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ గత సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయితే.. ‘డాకు మహారాజ్’ కూడా అదే పండుగ సీజన్లో విడుదల కానుంది. కాబట్టి చిరు సినిమా కంటే వసూళ్లు ఇంకా ఎక్కువ రావాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నిర్మాత నాగవంశీ సినిమా మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ బాబీ చిరంజీవి గారితో చేసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ బెటర్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇది బాగుంటుందా అని ఓ విలేకరి బాబీని అడిగారు.
దీనికి బాబీ జవాబు చెప్పడానికి ముందే నాగవంశీ అందుకున్నాడు. ‘‘బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. నేను బాలయ్య గారి అభిమానిని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే ఓ విషయం చెబుతా. ఆ సినిమా కంటే ఈ సినిమాను చాలా బాగా తీశాడు బాబీ. ఈ సినిమా కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి చెబుతున్నా. కాబట్టి దాని కంటే ‘డాకు మహారాజ్’ ఇంకా బాగుంటుంది. రేప్పొద్దున థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే మాట చెబుతారు’’ అని నాగవంశీ అన్నాడు. మరి వంశీ చెప్పినంత గొప్పగా ‘డాకు మహారాజ్’ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on December 23, 2024 4:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…