బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ వసూళ్లు దర్శకుడు ప్రశాంత్ నీల్కు సంతృప్తినివ్వలేదట. ఈ సినిమా సాధించిన ఫలితం మీద తాను అసంతృప్తిగానే ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వ్యాఖ్యానించడం విశేషం. దర్శకుడిగా ప్రశాంత్ తొలి చిత్రం ఉగ్రం కథనే కొంచెం పెద్ద స్కేల్లో సలార్గా తీశాడు ప్రశాంత్.
ఉగ్రం సినిమాకు ఆశించిన కమర్షియల్ విజయం దక్కలేదన్న ఉద్దేశంతో దాన్ని మరింత మందికి రీచ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభాస్ హీరోగా పెద్ద కాన్వాస్లో ఈ సినిమా తీశాడు. ఈ నేపథ్యంలో సలార్ ఫలితంతో సంతృప్తి చెందారా.. ఈ కథ అందరికీ రీచ్ అయిందని భావిస్తున్నారా అని అడిగితే ఒకింత నిరాశను వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాను సలార్ సినిమా కోసం పడ్డ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ సినిమా రిజల్ట్ విషయంలో కొంత నిరాశ చెందానని ప్రశాంత్ తెలిపాడు.
ఈ సినిమా ఇంకా బాగా ఆడాల్సిందన్నాడు. ఐతే కేజీఎఫ్-2 సినిమా నుంచి బయటికి వచ్చి సలార్ సినిమా తీసే విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నానేమో అని కూడా ప్రశాంత్ వ్యాఖ్యానించాడు. ఐతే సలార్-2 విషయంలో మాత్రం అభిమానులు ఎంతమాత్రం నిరాశ చెందొద్దని అతను భరోసా ఇచ్చాడు. ఆ సినిమా స్క్రిప్టు విషయంలో ఎంతో కసరత్తు చేస్తున్నట్లు తెలిపాడు. ఆ సినిమాకు రైటింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. తన కెరీర్లోనే బెస్ట్ వర్క్గా దాన్ని చెప్పొచ్చని ప్రశాంత్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
సలార్-2 స్టోరీ, దాని కాన్వాస్ అన్నీ కూడా వేరే స్థాయిలో ఉంటాయని ప్రశాంత్ తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక 2026లో సలార్-2ను పట్టాలెక్కించే అవకాశముంది. ఫస్ట్ పార్ట్ను సీజ్ ఫైర్ పేరుతో తెరకెక్కించిన ప్రశాంత్.. సెకండ్ పార్ట్ను శౌర్యాంగ పర్వం పేరుతో రూపొందించనున్నాడు.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…