ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు పరారయ్యారు. మొత్తంగా జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసం వద్ద.. తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మరోవైపు.. ఐకాన్ స్టార్ బౌన్సర్ల వ్యవహారంపైనా కూడా.. పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కమిషనర్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు.
మొత్తంగా అల్లు అర్జున్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయం త్రం 5 గంటల తర్వాత.. మొత్తం సీన్ మారిపోయినట్టు స్ఫష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు నాయకులు మాత్రమే స్పందించారు. ఇదే సమయంలో డీజీపీ జితేంద్ర స్పందించారు. అయితే.. ఇక, అప్పటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఓ సంఘం ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో.. అల్లు నివాసంపైకి దూసుకువచ్చారు.
సంధ్య థియేటర్లో తోపులాట ఘటనకు, మహిళ రేవతి మృతికి, చిన్నారు శ్రీతేజ్ ఆసుపత్రి పాలుకావడానికి అల్లు అర్జునే కారణమని వారు ఆరోపించారు. అర్జున్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. కొందరు నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమని పెద్ద ఎత్తున నినదించారు. రేవతి కుటుంబానికి తక్షణమే కోటి రూపాయలు సాయం చేయాలని వారు డిమాండ్ చేయడం గమగనార్హం.
కాగా, ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మరోవైపు.. బౌన్సర్లను ఉద్దేశించి సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. వారేమీ.. యోధులు కారన్నారు. ప్రజలను గౌరవించాలని. ఎవరిపైనా దూకుడు ప్రదర్శించేందుకు అవకాశం లేదని.. వారికి కొన్ని హద్దులు ఉన్నాయని స్పష్టం చేశారు. హద్దులు దాటితే.. చట్ట ప్రకారం బౌన్సర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సంధ్య ధియేటర్ ఘటనలో ప్రేక్షకులను తోసేసి, బూతులు తిట్టిన విషయం తమ పరిశీలనలో ఉందన్నారు.
This post was last modified on December 22, 2024 6:59 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…