ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు పరారయ్యారు. మొత్తంగా జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసం వద్ద.. తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మరోవైపు.. ఐకాన్ స్టార్ బౌన్సర్ల వ్యవహారంపైనా కూడా.. పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కమిషనర్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు.
మొత్తంగా అల్లు అర్జున్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయం త్రం 5 గంటల తర్వాత.. మొత్తం సీన్ మారిపోయినట్టు స్ఫష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు నాయకులు మాత్రమే స్పందించారు. ఇదే సమయంలో డీజీపీ జితేంద్ర స్పందించారు. అయితే.. ఇక, అప్పటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఓ సంఘం ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో.. అల్లు నివాసంపైకి దూసుకువచ్చారు.
సంధ్య థియేటర్లో తోపులాట ఘటనకు, మహిళ రేవతి మృతికి, చిన్నారు శ్రీతేజ్ ఆసుపత్రి పాలుకావడానికి అల్లు అర్జునే కారణమని వారు ఆరోపించారు. అర్జున్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. కొందరు నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమని పెద్ద ఎత్తున నినదించారు. రేవతి కుటుంబానికి తక్షణమే కోటి రూపాయలు సాయం చేయాలని వారు డిమాండ్ చేయడం గమగనార్హం.
కాగా, ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మరోవైపు.. బౌన్సర్లను ఉద్దేశించి సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. వారేమీ.. యోధులు కారన్నారు. ప్రజలను గౌరవించాలని. ఎవరిపైనా దూకుడు ప్రదర్శించేందుకు అవకాశం లేదని.. వారికి కొన్ని హద్దులు ఉన్నాయని స్పష్టం చేశారు. హద్దులు దాటితే.. చట్ట ప్రకారం బౌన్సర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సంధ్య ధియేటర్ ఘటనలో ప్రేక్షకులను తోసేసి, బూతులు తిట్టిన విషయం తమ పరిశీలనలో ఉందన్నారు.
This post was last modified on December 22, 2024 6:59 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…