ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు పరారయ్యారు. మొత్తంగా జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసం వద్ద.. తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మరోవైపు.. ఐకాన్ స్టార్ బౌన్సర్ల వ్యవహారంపైనా కూడా.. పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కమిషనర్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు.
మొత్తంగా అల్లు అర్జున్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయం త్రం 5 గంటల తర్వాత.. మొత్తం సీన్ మారిపోయినట్టు స్ఫష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు నాయకులు మాత్రమే స్పందించారు. ఇదే సమయంలో డీజీపీ జితేంద్ర స్పందించారు. అయితే.. ఇక, అప్పటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఓ సంఘం ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో.. అల్లు నివాసంపైకి దూసుకువచ్చారు.
సంధ్య థియేటర్లో తోపులాట ఘటనకు, మహిళ రేవతి మృతికి, చిన్నారు శ్రీతేజ్ ఆసుపత్రి పాలుకావడానికి అల్లు అర్జునే కారణమని వారు ఆరోపించారు. అర్జున్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. కొందరు నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమని పెద్ద ఎత్తున నినదించారు. రేవతి కుటుంబానికి తక్షణమే కోటి రూపాయలు సాయం చేయాలని వారు డిమాండ్ చేయడం గమగనార్హం.
కాగా, ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. మరోవైపు.. బౌన్సర్లను ఉద్దేశించి సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. వారేమీ.. యోధులు కారన్నారు. ప్రజలను గౌరవించాలని. ఎవరిపైనా దూకుడు ప్రదర్శించేందుకు అవకాశం లేదని.. వారికి కొన్ని హద్దులు ఉన్నాయని స్పష్టం చేశారు. హద్దులు దాటితే.. చట్ట ప్రకారం బౌన్సర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సంధ్య ధియేటర్ ఘటనలో ప్రేక్షకులను తోసేసి, బూతులు తిట్టిన విషయం తమ పరిశీలనలో ఉందన్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…