తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా తక్కువగానే మాట్లాడతాడు. స్టేజ్ల మీద పంచులు విసరడం.. సెటైర్లు వేయడం తక్కువే. అలాంటి వాడు దిల్ రాజు మీద భలే పంచ్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. చరణ్ కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ను అమెరికాలోని డల్లాస్లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అమెరికాలో తెలుగు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లు చేయడం కొత్తేమీ కాదు కానీ.. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లుగా భారీ స్థాయిలో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ వేడుకకు రామ్ చరణే ప్రత్యేక ఆకర్షణగా మారాడు. తన ఎంట్రీ, స్పీచ్ అన్నీ కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. తన ప్రసంగంలో చరణ్.. నిర్మాత దిల్ రాజును అనుకరించడం హైలైట్గా మారింది. సంగీత దర్శకుడు తమన్ గురించి మాట్లాడుతూ.. ఈసారి రాజు జోక్యం లేకుండా తమన్ తను చేయాలనుకున్నది చేశాడంటూ సరదాగా వ్యాఖ్యానించాడు చరణ్. అంతటితో ఆగకుండా రాజును అనుకరించాడు. సినిమాలో ఏం కావాలో అన్నీ ఇరుక్కు అంటూ.. ఇంతేనా రాజు గారూ అన్నాడు.
రాజు దగ్గరికి వచ్చి మాట సాయం అందిస్తుంటే.. సినిమాలో ఫైట్ కావాలంటే ఫైట్ ఇరుక్కు, సాంగ్ కావాలంటే సాంగ్ ఇరుక్కు.. ఇంకా ఏం కావాలో అన్నీ ఇరుక్కు అంటూ చరణ్ నవ్వేశాడు. రెండేళ్ల కిందట తాను నిర్మించిన తమిళ చిత్రం ‘వారిసు’ ఆడియో వేడుకలో దిల్ రాజు తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ సందర్భంగా సాంగ్ వేనుమా సాంగ్ ఇరుక్కు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు.. ఎల్లా ఇరుక్కు అంటూ ఆయన చేసిన ప్రసంగం అందరినీ నవ్వించింది. సోషల్ మీడియాలో ఆ స్పీచ్ బాగా పాపులర్ అయింది. దీని మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే రామ్ చరణ్ కూడా.. దిల్ రాజును సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.
This post was last modified on December 22, 2024 6:28 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…