పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టు, తదనంతర పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బన్నీ మీద తీవ్ర ఆరోపణలే చేశారు. దీనికి బదులుగా ప్రెస్ మీట్ పెట్టి బన్నీ వివరణ ఇచ్చుకున్నాడు.
తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమంటూ ఖండించాడు. ఐతే రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత.. ఆ తర్వాత బన్నీ ఇచ్చిన వివరణలో వాస్తవాలెంత.. ఇరు వర్గాల్లో ఎవరి వాదన సమర్థంగా ఉంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఐతే రెండు వర్గాల వ్యాఖ్యల్లోనూ కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి. బన్నీ ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన ఓ కామెంట్ అతడికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. తాను పుష్ప-2 చూసేందుకు సంధ్య థియేటర్లోకి వెళ్లాక.. జనసందోహం ఎక్కువైందని, అదుపు చేయలేని పరిస్థితి ఉందని తన టీం సభ్యులు చెప్పడంతో సినిమా మొదలైన కాసేపటికే అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు బన్నీ వెల్లడించాడు.
కానీ అతను సినిమా ఆరంభానికి ముందు వచ్చి రెండు గంటలకు పైగా అక్కడున్నట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. బన్నీని థియేటర్లో చూసిన ఆనందంలో అభిమానులు ఆ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలే ఇందుకు ఆధారం. బన్నీ ఓపెనింగ్ సీన్లో థియేటర్లో ఉన్నాడు. అలాగే జాతర సీన్ సమయంలో కూడా అక్కడే ఉన్నాడు. అంటే రెండు గంటలకు పైగా బన్నీ థియేటర్లో ఉన్న మాట నిజమని తేలిపోయింది. దీంతో అతడి వాదన వీగిపోయింది.
ఇదిలా ఉంటే బన్నీ థియేటర్లో ఉండగానే అతడికి తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం తెలిసినా అక్కడ్నుంచి కదల్లేదని రేవంత్ రెడ్డి అంటే.. మహిళ చనిపోతే తన సినిమా హిట్ అని బన్నీ వ్యాఖ్యానించాడని అక్బరుద్దీన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కానీ తన భార్య చనిపోయిన విషయం తనకు అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తెలిసినట్లు మృతురాలి భర్త మీడియాకు గతంలో వెల్లడించారు. భర్తకే ఆ విషయం అప్పుడు తెలిసినపుడు సినిమా మధ్యలో బన్నీకి ఈ విషయం ఎలా తెలుస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని బట్టి ఇరు వర్గాల వాదనల్లోనూ సరైన బలం లేదని అర్థమవుతోంది.
This post was last modified on December 22, 2024 2:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…