ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర విజయాన్ని ఆస్వాదించి వార్ 2 పూర్తి చేసుకునే పనిలో పడ్డ తారక్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి నీల్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా విడుదలని 2026 జనవరికి ప్రకటించారు. అప్పటికి మాట మీద ఉంటారా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏ జానరనే దాని గురించి కొంచెం సస్పెన్స్ వీడింది.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. గతంలో తాను చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడొచ్చన్న మాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు కానీ ఇది చెబుతున్నపుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. క్యాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ లాక్ కావడం దాదాపు పక్కానే. టైం చూసుకుని అఫీషియల్ చేస్తారని సమాచారం.
మరి సలార్ 2 శౌర్యంగపర్వం ఎప్పుడు ఉంటుందనే డెడ్ లైన్ ప్రశాంత్ నీల్ చెప్పకపోయినా మొదటిభాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ఊహించని సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు. ఎంతలేదన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సుమారు ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. వార్ 2 చివరి దశలో ఉన్న తారక్ నీల్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇలాంటి పవర్ హౌస్ ని కెజిఎఫ్ దర్శకుడు ఏ రేంజ్ లో చూపిస్తాడానే ఆసక్తి అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. కంటెంట్ సరిగ్గా కుదిరితే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయమే.
This post was last modified on December 22, 2024 2:30 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…