ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర విజయాన్ని ఆస్వాదించి వార్ 2 పూర్తి చేసుకునే పనిలో పడ్డ తారక్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి నీల్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా విడుదలని 2026 జనవరికి ప్రకటించారు. అప్పటికి మాట మీద ఉంటారా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏ జానరనే దాని గురించి కొంచెం సస్పెన్స్ వీడింది.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. గతంలో తాను చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడొచ్చన్న మాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు కానీ ఇది చెబుతున్నపుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. క్యాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ లాక్ కావడం దాదాపు పక్కానే. టైం చూసుకుని అఫీషియల్ చేస్తారని సమాచారం.
మరి సలార్ 2 శౌర్యంగపర్వం ఎప్పుడు ఉంటుందనే డెడ్ లైన్ ప్రశాంత్ నీల్ చెప్పకపోయినా మొదటిభాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ఊహించని సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు. ఎంతలేదన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సుమారు ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. వార్ 2 చివరి దశలో ఉన్న తారక్ నీల్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇలాంటి పవర్ హౌస్ ని కెజిఎఫ్ దర్శకుడు ఏ రేంజ్ లో చూపిస్తాడానే ఆసక్తి అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. కంటెంట్ సరిగ్గా కుదిరితే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయమే.
This post was last modified on December 22, 2024 2:30 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…