ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర విజయాన్ని ఆస్వాదించి వార్ 2 పూర్తి చేసుకునే పనిలో పడ్డ తారక్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి నీల్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా విడుదలని 2026 జనవరికి ప్రకటించారు. అప్పటికి మాట మీద ఉంటారా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏ జానరనే దాని గురించి కొంచెం సస్పెన్స్ వీడింది.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. గతంలో తాను చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడొచ్చన్న మాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు కానీ ఇది చెబుతున్నపుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. క్యాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ లాక్ కావడం దాదాపు పక్కానే. టైం చూసుకుని అఫీషియల్ చేస్తారని సమాచారం.
మరి సలార్ 2 శౌర్యంగపర్వం ఎప్పుడు ఉంటుందనే డెడ్ లైన్ ప్రశాంత్ నీల్ చెప్పకపోయినా మొదటిభాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ఊహించని సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు. ఎంతలేదన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సుమారు ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. వార్ 2 చివరి దశలో ఉన్న తారక్ నీల్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇలాంటి పవర్ హౌస్ ని కెజిఎఫ్ దర్శకుడు ఏ రేంజ్ లో చూపిస్తాడానే ఆసక్తి అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. కంటెంట్ సరిగ్గా కుదిరితే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయమే.
This post was last modified on December 22, 2024 2:30 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…