అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న కొన్ని సంఘటనలు సినిమాలో చూస్తారని, అవి ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా చప్పట్లు కూడా కొట్టిస్తాయని చెప్పడం ఒక్కసారిగా అంచనాలను మరింత పెంచేసింది. అవి ఏంటనేది చెప్పలేదు కానీ ఇవి నాలుగేళ్ల క్రితమే దర్శకుడు శంకర్ రాసుకున్నారని, ఇప్పుడవి నిజం కావడం థ్రిల్ ఇస్తుందనే తరహాలో హింట్స్ ఇవ్వడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీస్తున్నాయి. ఎవరికి తమకు తోచిన కోణంలో గత కొన్నేళ్లలో జరిగిన కీలక ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు.
శంకర్ వర్తమాన పరిస్థితులను సినిమాల్లో చూపించడం కొత్త కాదు. జెంటిల్ మెన్ లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కడులో కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయుడులో లంచగొండితనం, ప్రేమికుడులో దుర్మార్గ గవర్నర్ ఇలా ఎన్నో టచ్ చేశారు. కొన్ని వివాదాలు అయినా ప్రేక్షకులు వాటిని విపరీతంగా ఆదరించారు. తన స్కూల్ ని పక్కనపెట్టి చేసిన బాయ్స్, ఐ లాంటివి మాత్రమే ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రోబో ఒకటే ఇండస్ట్రీ హిట్టయ్యింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ రూపంలో మరోసారి వింటేజ్ శంకర్ ని చూడొచ్చన్న మాట. దిల్ రాజు అంత ప్రత్యేకంగా అన్న మాటల్లోని ప్రధాన అంతరార్థం ఇదే.
ఏదైతేనేం శంకర్, చరణ్ ఫ్యాన్స్ కోరుకున్న అంశాలైతే గేమ్ ఛేంజర్ లో ఉన్నాయనే క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ 2 గాయం నుంచి ఇది ఖచ్చితంగా బయటపడేస్తుందనే ధీమా శంకర్ లో కనిపిస్తోంది. పైగా ఇది సక్సెస్ అయితే ఇండియన్ 3 మీద కూడా హైప్ వచ్చేస్తుంది. వచ్చే వారం ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. 27న హైదరాబాద్ లో ఉండొచ్చని సమాచారం. మరో ఈవెంట్ రాజమండ్రిలో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అతిథిగా ఎక్కడనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది. పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ తర్వాత భారీ బిజినెస్ తో టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇదే.
This post was last modified on December 22, 2024 12:08 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…