కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా తెర మీదే కాక, బయట కూడా అందాలు ఆరబోస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో తన తొలి చిత్రం ‘బేబీ జాన్’ ఖరారయ్యాక ఆమె లుక్స్ పూర్తిగా మారిపోయాయి. ఫొటో షూట్లలోనే కాక ఏదైనా ఈవెంట్లకు హాజరైనా సూపర్ గ్లామరస్ గా కనిపిస్తోంది కీర్తి. ఐతే ఎంత గ్లామర్ హీరోయిన్లయినా పెళ్లి తర్వాత డోస్ తగ్గించేస్తుంటారు. కొంచెం ట్రెడిషనల్ లుక్స్లోకి మారిపోతుంటారు.
కానీ కీర్తి మాత్రం తాను డిఫరెంట్ అని చాటుతోంది. ఆంటోనీని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఆమె ‘బేబీ జాన్’ ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఆ ప్రమోషన్లలో తన లుక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్లు తాళి ధరించి కనిపించడం అరుదు. కానీ కీర్తి మాత్రం ఆంటోనీ కట్టిన మంగళసూత్రాన్ని డిస్ ప్లే చేస్తూ కనిపిస్తోంది. అదే సమయంలో గ్లామర్ డోస్ తగ్గకుండా చూస్తోంది. మొన్న రెడ్ స్కర్ట్లో మంగళసూత్రం ఎలివేట్ అయ్యేలా ఆమె కనిపించిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
కీర్తి ట్రెండ్ సెటర్ అని ఆ సందర్భంగా కొనియాడారు. ఆ తర్వాత కీర్తి ‘బేబీ జాన్’ టీంతో కలిసి ‘బిగ్ బాస్’ షోకు వెళ్లింది. ఆమెకు తోడుగా వచ్చిన మరో హీరోయిన్ వామికా గబ్బి కూడా సెక్సీగా తయారైనా సరే.. అందరి చూపూ కీర్తి మీదే నిలిచేలా ఆమె తన లుక్స్తో కీర్తి కట్టిపడేసింది. అక్కడ కూడా తన మంగళసూత్రం బాగా డిస్ప్లే అయ్యేలా చూసుకుంది కీర్తి. తనకు పెళ్లయిన విషయాన్ని గుర్తు చేస్తూనే ఇంత గ్లామరస్గా కనిపించడం కీర్తికే చెల్లింది. ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 21, 2024 5:16 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…