‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా చూసి టాలీవుడ్ నుంచి కొందరు పెద్ద స్టార్లు కూడా తనతో పని చేయడానికి ఆసక్తి చూపించారు. అతనేమో బాలీవుడ్కు వెళ్లిపోయి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేశాడు. అది ఇంకరా పెద్ద విజయం సాధించింది. దీని తర్వాత రణబీర్ కపూర్ హీరోగా తీసిన ‘యానిమల్’ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మార్మోగిపోయింది. తనతో ఒక్క సినిమా చేయాలని ఆశపడే హీరోల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఈ జాబితాలోకి హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా వచ్చాడు. ‘కాంతార’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న రిషబ్.. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’, ‘జై హనుమాన్’, ‘ఛత్రపతి శివాజీ’ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. ఇలాంటి లైనప్తో ఉండి కూడా వంగతో ఓ సినిమా చేయాలని అతను ఆశపడుతున్నాడు.
‘‘సందీప్ రెడ్డి వంగ చాలా క్రేజీగా ఆలోచిస్తారు. ఎవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తాయి. తన సినిమాలో నటించాలని ఉంది. అతను ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం’’ అని రిషబ్ వ్యాఖ్యానించాడు. రిషబ్ కన్నడ సినిమాకు గర్వ కారణంగా మారాడు. తన భాష, తన ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు. ఆత్మాభిమానంతో మాట్లాడే అలాంటి నటుడు, దర్శకుడు కూడా సందీప్ రెడ్డి సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే మన డైరెక్టర్కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రిషబ్ ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే ఏఢాది దసరాకు రిలీజవుతుంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. తన సొంత గ్రామంలోనే అతను ‘కాంతార’ సినిమా తీశాడు. అక్కడి జనాలనే ఈ చిత్రంలో నటింపజేశాడు. ఇప్పుడు కాంతార చాప్టర్ 1కు కూడా అదే లొకేషన్ ఎంచుకున్నాడు. తన గ్రామాన్ని సినిమా హబ్గా మార్చాలని ఉండేదని.. ఆ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని.. మున్ముందు తన గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని రిషబ్ అన్నాడు.
This post was last modified on December 21, 2024 4:59 pm
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…