క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్ రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో ఈ సీజన్ కొంచెం కళ తప్పింది. తెలుగు నుంచి క్రిస్మస్ బరిలో నిలిచిన ఏకైక మూవీ ‘బచ్చల మల్లి’ ఒక మోస్తరుగా క్రేజ్ తెచ్చుకుంది. దీంతో మూడు డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతుండడం విశేషం. ఉపేంద్ర సినిమా ‘యుఐ’, విజయ్ సేతుపతి మూవీ ‘విడుదల-2’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా’ వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
ఐతే యానిటమేటెడ్ మూవీ అయినా ‘ముఫాసా’ని జనం ఏం చూస్తారులే అని మిగతా చిత్రాలు లైట్ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. డిస్నీ వాళ్లు ‘ది లయన్ కింగ్’ లైన్లోనే రూపొందించిన ‘ముఫాసా’ మీద వరల్డ్ వైడ్ మంచి బజ్ ఉంది. ఇలాంటి సినిమాలు చూడ్డానికి అమితాసక్తి చూపిస్తారు. సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో ఈ తరహా సినిమాలు హౌస్ ఫుల్స్తో రన్ అవుతాయి. ఐతే ‘ముఫాసా’ చిన్న టౌన్లలో కూడా బాగా ఆడితే ఆశ్చర్యమేమీ లేదు. దీనికి బుకింగ్స్ అన్ని చోట్లా బాగున్నాయి కూడా.
అందుక్కారణం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాక్టర్. ఇందులో ముఫాసా పాత్రకు మహేషే గాత్రం అందించాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద మహేష్ కటౌట్లు పెట్టడం.. అక్కడక్కడా బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడం.. ఇలా హంగామా మామూలుగా లేదు. ‘ముఫాసా’ బుకింగ్స్ జోరుగా సాగుతుండడంలో మహేష్ ఫ్యాక్టర్ కీలకంగానే కనిపిస్తోంది.
కాబట్టి జంతువుల సినిమా అని పోటీలో ఉన్న మిగతా చిత్రాలు లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే క్రిస్మస్ సీజన్లో ఇండియా వైడ్ ఇదే నంబర్ వన్ మూవీగా నిలిచినా ఆశ్చర్యం లేదు. గతంలో ‘జంగిల్ బుక్’ ఇండియాలో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయాన్ని మరువరాదు.
This post was last modified on December 18, 2024 4:56 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…