టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్లను భిన్న ధ్రువాలుగా చెప్పొచ్చు. వీళ్లిద్దరి సినిమాలను పోల్చడానికి అవకాశముండదు. ఎవరి స్టయిల్లో వాళ్లు సినిమాలు తీస్తారు. ఇద్దరి కథలు.. వాటి నరేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల సినిమాల్లో కనిపించే ఆర్టిస్టుల విషయంలోనూ చాలా వైరుధ్యం కనిపిస్తుంటుంది.
హీరోలు, హీరోయిన్లు, లీడ్ విలన్ల సంగతి పక్కన పెడితే.. మిగతా ఆర్టిస్టుల విషయంలో చాలా తేడాలుంటాయి. ఒకరి సినిమాల్లో కనిపించే ఆర్టిస్టులు ఇంకొకరి చిత్రాల్లో కనిపించడం అరుదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఫేవరెట్ ఆర్టిస్టుల్లో ఒకరు, అతడి మిత్రుడు కూడా అయిన సునీల్.. సుకుమార్ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ముందు అనుకున్న ఒక ఆర్టిస్టును తప్పించి మరీ సునీల్కు తన కొత్త చిత్రం ‘పుష్ప’లో అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో పడ్డాడట సుక్కు.
అల్లు అర్జున్ హీరోగా సుక్కు తెరకెక్కించబోయే ‘పుష్ప’ ఇంకొన్ని రోజుల్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. కాగా ఇప్పుడు కొన్ని పాత్రల విషయంలో ఆర్టిస్టులను మారుస్తున్నట్లు తెలిసింది. అందులో పాత్ర కోసం కొంచెం చిన్న స్థాయి క్యారెక్టర్ నటుడిని అనుకోగా.. అతణ్ని తప్పించి ఇప్పుడు ఆ స్థానంలోకి సునీల్ను తెస్తున్నట్లు తెలిసింది. సునీల్ను ఈ సినిమాకు తీసుకోవాలని బన్నీకి త్రివిక్రమ్ చెప్పగా.. అతను సుక్కుకు రెకమండ్ చేసి తనకు సినిమాలో పాత్రను ఇప్పించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ పాత్ర సునీల్ కంటే అంతకుముందు అనుకున్న నటుడిగా బాగుంటుందట. కానీ తనకు ‘అల వైకుంఠపురములో’ లాంటి మెగా హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కోసం బన్నీ సునీల్కు ఈ పాత్ర ఇప్పించాలని బన్నీ భావించాడు. బన్నీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సుకుమార్ కాదనలేకపోయాడట. ఇలాగే మరికొన్ని మార్పులు చేర్పులు చేసి వాటిని ఫైనలైజ్ చేసి షూటింగ్కు వెళ్లిపోవాలని చూస్తున్నట్లు సమాచారం.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…