Rx 100 Director Ajay
ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. రెండేళ్ల తర్వాత కూడా తన రెండో సినిమాను మొదలుపెట్టే స్థితిలో లేడు అజయ్ భూపతి. ఇప్పుడైతే కరోనా వల్ల షూటింగులు జరిగే పరిస్థితి లేదు కానీ.. దీనికి ముందు ఏడాదిన్నర కాలంలో అతను తన సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు.
మల్టీస్టారర్ కథతో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే అజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. మాస్ రాజా రవితేజ సహా కొందరు హీరోల్ని ట్రై చేసి చివరికి ప్రధాన కథానాయకుడిగా శర్వానంద్ను ఖరారు చేశాడు.
మరో హీరో పాత్రకు హీరోను ఫైనలైజ్ చేయడంలోనూ ఆలస్యం జరిగింది. చివరికి తమిళ హీరో సిద్దార్థ్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఐతే మల్టీస్టారర్ కథ కావడం, దీనికి హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే చాలా ఆలస్యం జరగడంతో అజయ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు అంటూ అతను ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తానికి హీరోలైతే ఖరారయ్యారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. కాబట్టి కరోనా ప్రభావం తగ్గాక సినిమా పట్టాలెక్కడం లాంఛనమే కావచ్చు.
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…