Rx 100 Director Ajay
ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. రెండేళ్ల తర్వాత కూడా తన రెండో సినిమాను మొదలుపెట్టే స్థితిలో లేడు అజయ్ భూపతి. ఇప్పుడైతే కరోనా వల్ల షూటింగులు జరిగే పరిస్థితి లేదు కానీ.. దీనికి ముందు ఏడాదిన్నర కాలంలో అతను తన సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు.
మల్టీస్టారర్ కథతో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే అజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. మాస్ రాజా రవితేజ సహా కొందరు హీరోల్ని ట్రై చేసి చివరికి ప్రధాన కథానాయకుడిగా శర్వానంద్ను ఖరారు చేశాడు.
మరో హీరో పాత్రకు హీరోను ఫైనలైజ్ చేయడంలోనూ ఆలస్యం జరిగింది. చివరికి తమిళ హీరో సిద్దార్థ్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఐతే మల్టీస్టారర్ కథ కావడం, దీనికి హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే చాలా ఆలస్యం జరగడంతో అజయ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు అంటూ అతను ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తానికి హీరోలైతే ఖరారయ్యారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. కాబట్టి కరోనా ప్రభావం తగ్గాక సినిమా పట్టాలెక్కడం లాంఛనమే కావచ్చు.
This post was last modified on April 29, 2020 9:48 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…