Rx 100 Director Ajay
ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. రెండేళ్ల తర్వాత కూడా తన రెండో సినిమాను మొదలుపెట్టే స్థితిలో లేడు అజయ్ భూపతి. ఇప్పుడైతే కరోనా వల్ల షూటింగులు జరిగే పరిస్థితి లేదు కానీ.. దీనికి ముందు ఏడాదిన్నర కాలంలో అతను తన సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు.
మల్టీస్టారర్ కథతో తెరకెక్కాల్సిన ఈ సినిమాకు హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే అజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. మాస్ రాజా రవితేజ సహా కొందరు హీరోల్ని ట్రై చేసి చివరికి ప్రధాన కథానాయకుడిగా శర్వానంద్ను ఖరారు చేశాడు.
మరో హీరో పాత్రకు హీరోను ఫైనలైజ్ చేయడంలోనూ ఆలస్యం జరిగింది. చివరికి తమిళ హీరో సిద్దార్థ్ను ఈ పాత్రకు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఐతే మల్టీస్టారర్ కథ కావడం, దీనికి హీరోల్ని ఖరారు చేసుకోవడంలోనే చాలా ఆలస్యం జరగడంతో అజయ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు అంటూ అతను ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తానికి హీరోలైతే ఖరారయ్యారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. కాబట్టి కరోనా ప్రభావం తగ్గాక సినిమా పట్టాలెక్కడం లాంఛనమే కావచ్చు.
This post was last modified on April 29, 2020 9:48 am
‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…
విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…
హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…
ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…