క్రిస్మస్ రేస్ నుంచి రాబిన్ హుడ్ తప్పుకోవడంలో ఇంకెలాంటి అనుమానాలు లేవు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేయడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషం దాకా నితిన్ డిసెంబర్ 25 కోసమే పట్టుబట్టినప్పటికీ నిర్మాతలు, స్వతహాగా డిస్ట్రిబ్యూటరైన తండ్రి పరిస్థితులను వివరించి చెప్పాక వెనుకడుగుకు సిద్ధమయ్యాడట. అయితే 2025 సంక్రాంతి బరిలో దింపాలనే ప్రతిపాదన మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విడాముయర్చిలతో తలపడటం ఎంత సేఫనే కోణంలో ప్రస్తుతం చర్చలు చేస్తున్నారని తెలిసింది.
ఇప్పుడు రాబిన్ హుడ్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి జనవరి చివరికి వెళ్లిపోవడం. లేదూ అంటే ఫిబ్రవరిలో శివరాత్రిని లాక్ చేసుకోవడం. కానీ నితిన్ దే మరో సినిమా తమ్ముడు ఆల్రెడీ పండగ మీద కర్చీఫ్ వేసింది. నిర్మాత దిల్ రాజు ముందస్తుగా ఆలోచించి సరైన సీజన్ ని ఎంచుకున్నాడు. ఒకవేళ రాబిన్ హుడ్ కనక శివరాత్రిని కోరుకుంటే తమ్ముడుని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన రాజుగారు దానికి ఒప్పుకుంటారా అనేది డౌటే. మైత్రి సంస్థతో ఉన్న పోటీ దృష్యా ఇదంత సులభం కాదు. తక్కువ గ్యాప్ లో తనవే రెండు పెద్ద సినిమాలు రావడం నితిన్ స్వతహాగా ఇష్టపడడు.
సో ఇదంతా తేలేందుకు కొంచెం టైం పట్టేలా ఉంది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే తమ్ముడు గత అక్టోబర్ లోనే వచ్చేది. కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు యాక్షన్ ఎపిసోడ్లకు దర్శకుడు వేణు శ్రీరామ్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. ఈ రెండు సినిమాల మీద కలిపి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. దేనికవి అగ్ర బ్యానర్లు కావడంతో కాంప్రోమైజ్ అయ్యే విషయం అంత ఈజీ కాదు. రాబిన్ హుడ్ కనక రిపబ్లిక్ డేకి ఫిక్స్ అయితే టెన్షన్ ఉండదు. తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో తండేల్, రెండో వారంలో లైలా ఆపై కుబేర ఇలా లిస్టు పెద్దదే ఉంది. సో నితిన్ ప్రొడ్యూసర్ల చివరికి ఏం తెలుస్తారో.
This post was last modified on December 17, 2024 12:39 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…