క్రిస్మస్ రేస్ నుంచి రాబిన్ హుడ్ తప్పుకోవడంలో ఇంకెలాంటి అనుమానాలు లేవు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేయడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషం దాకా నితిన్ డిసెంబర్ 25 కోసమే పట్టుబట్టినప్పటికీ నిర్మాతలు, స్వతహాగా డిస్ట్రిబ్యూటరైన తండ్రి పరిస్థితులను వివరించి చెప్పాక వెనుకడుగుకు సిద్ధమయ్యాడట. అయితే 2025 సంక్రాంతి బరిలో దింపాలనే ప్రతిపాదన మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విడాముయర్చిలతో తలపడటం ఎంత సేఫనే కోణంలో ప్రస్తుతం చర్చలు చేస్తున్నారని తెలిసింది.
ఇప్పుడు రాబిన్ హుడ్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి జనవరి చివరికి వెళ్లిపోవడం. లేదూ అంటే ఫిబ్రవరిలో శివరాత్రిని లాక్ చేసుకోవడం. కానీ నితిన్ దే మరో సినిమా తమ్ముడు ఆల్రెడీ పండగ మీద కర్చీఫ్ వేసింది. నిర్మాత దిల్ రాజు ముందస్తుగా ఆలోచించి సరైన సీజన్ ని ఎంచుకున్నాడు. ఒకవేళ రాబిన్ హుడ్ కనక శివరాత్రిని కోరుకుంటే తమ్ముడుని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన రాజుగారు దానికి ఒప్పుకుంటారా అనేది డౌటే. మైత్రి సంస్థతో ఉన్న పోటీ దృష్యా ఇదంత సులభం కాదు. తక్కువ గ్యాప్ లో తనవే రెండు పెద్ద సినిమాలు రావడం నితిన్ స్వతహాగా ఇష్టపడడు.
సో ఇదంతా తేలేందుకు కొంచెం టైం పట్టేలా ఉంది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే తమ్ముడు గత అక్టోబర్ లోనే వచ్చేది. కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు యాక్షన్ ఎపిసోడ్లకు దర్శకుడు వేణు శ్రీరామ్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. ఈ రెండు సినిమాల మీద కలిపి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. దేనికవి అగ్ర బ్యానర్లు కావడంతో కాంప్రోమైజ్ అయ్యే విషయం అంత ఈజీ కాదు. రాబిన్ హుడ్ కనక రిపబ్లిక్ డేకి ఫిక్స్ అయితే టెన్షన్ ఉండదు. తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో తండేల్, రెండో వారంలో లైలా ఆపై కుబేర ఇలా లిస్టు పెద్దదే ఉంది. సో నితిన్ ప్రొడ్యూసర్ల చివరికి ఏం తెలుస్తారో.
This post was last modified on December 17, 2024 12:39 pm
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…