క్రిస్మస్ రేస్ నుంచి రాబిన్ హుడ్ తప్పుకోవడంలో ఇంకెలాంటి అనుమానాలు లేవు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేయడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. చివరి నిమిషం దాకా నితిన్ డిసెంబర్ 25 కోసమే పట్టుబట్టినప్పటికీ నిర్మాతలు, స్వతహాగా డిస్ట్రిబ్యూటరైన తండ్రి పరిస్థితులను వివరించి చెప్పాక వెనుకడుగుకు సిద్ధమయ్యాడట. అయితే 2025 సంక్రాంతి బరిలో దింపాలనే ప్రతిపాదన మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, విడాముయర్చిలతో తలపడటం ఎంత సేఫనే కోణంలో ప్రస్తుతం చర్చలు చేస్తున్నారని తెలిసింది.
ఇప్పుడు రాబిన్ హుడ్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి జనవరి చివరికి వెళ్లిపోవడం. లేదూ అంటే ఫిబ్రవరిలో శివరాత్రిని లాక్ చేసుకోవడం. కానీ నితిన్ దే మరో సినిమా తమ్ముడు ఆల్రెడీ పండగ మీద కర్చీఫ్ వేసింది. నిర్మాత దిల్ రాజు ముందస్తుగా ఆలోచించి సరైన సీజన్ ని ఎంచుకున్నాడు. ఒకవేళ రాబిన్ హుడ్ కనక శివరాత్రిని కోరుకుంటే తమ్ముడుని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన రాజుగారు దానికి ఒప్పుకుంటారా అనేది డౌటే. మైత్రి సంస్థతో ఉన్న పోటీ దృష్యా ఇదంత సులభం కాదు. తక్కువ గ్యాప్ లో తనవే రెండు పెద్ద సినిమాలు రావడం నితిన్ స్వతహాగా ఇష్టపడడు.
సో ఇదంతా తేలేందుకు కొంచెం టైం పట్టేలా ఉంది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే తమ్ముడు గత అక్టోబర్ లోనే వచ్చేది. కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు యాక్షన్ ఎపిసోడ్లకు దర్శకుడు వేణు శ్రీరామ్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. ఈ రెండు సినిమాల మీద కలిపి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. దేనికవి అగ్ర బ్యానర్లు కావడంతో కాంప్రోమైజ్ అయ్యే విషయం అంత ఈజీ కాదు. రాబిన్ హుడ్ కనక రిపబ్లిక్ డేకి ఫిక్స్ అయితే టెన్షన్ ఉండదు. తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో తండేల్, రెండో వారంలో లైలా ఆపై కుబేర ఇలా లిస్టు పెద్దదే ఉంది. సో నితిన్ ప్రొడ్యూసర్ల చివరికి ఏం తెలుస్తారో.
This post was last modified on December 17, 2024 12:39 pm
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…