రాజమౌళి కలల ప్రాజెక్టు ఏది అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు. దీని గురించి కెరీర్లో ఓ స్థాయి అందుకున్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు జక్కన్న. బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్టు చేయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం కావాలని చెప్పాడు. ఆ పదేళ్లు గడిచిపోయాయి. మహాభారతం గురించి కొత్త కబురేమీ లేదు. మహేష్ బాబుతో చేయనున్న సినిమా రెండు భాగాలంటున్నారు. అదెప్పటికి పూర్తవుతుందో.. రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలుపెడతాడో క్లారిటీ లేదు.
కానీ బాలీవుడ్లో మరో లెజెండ్ కూడా మహాభారతాన్ని ఒక మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నాడు. ఆయనే.. ఆమిర్ ఖాన్. ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు. రాజమౌళి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్టు అంటున్నా సరే.. ఆమిర్ తన ప్రయత్నాలేమీ ఆపట్లేదు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆమిర్. మహాభారతం గురించి ఆమిర్ స్పందిస్తూ.. “నా డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది.
ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఆ కథ మన భారతీయులుగా రక్తంలోనే ఉంది. కాబట్టి అది నా మీద బాధ్యతను పెంచుతోంది. దీన్ని ఏమాత్రం రాజీ లేకుండా, సరైన పద్ధతిలో రూపొందించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్టుతో భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. ప్రతి భారతీయుడూ గర్వించేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో లేదో తెలియదు. కానీ నేను మాత్రం దీని మీద పని చేయాలనుకుంటున్నా” అని ఆమిర్ అన్నాడు.
ఇది జరుగుతుందో లేదో అని ఆమిర్ పేర్కొనడంతో అతను ఈ ప్రాజెక్టు చేయడంపై కొంత సందేహాలు కలుగుతున్నాయి. రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టును ప్రకటిస్తే ఆమిర్ వెనక్కి తగ్గే అవకాశముంది. లేదంటే మాత్రం ప్రొసీడ్ కావచ్చు. ఇదిలా ఉండగా గతంలో తాను మూడేళ్లకు ఒక సినిమా చేసేవాడినని.. భవిష్యత్తులో ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నానని ఆమిర్ చెప్పడం విశేషం.
This post was last modified on December 17, 2024 10:33 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…