రాజమౌళి కలల ప్రాజెక్టు ఏది అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు. దీని గురించి కెరీర్లో ఓ స్థాయి అందుకున్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు జక్కన్న. బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్టు చేయడానికి తనకు ఇంకో పదేళ్ల అనుభవం కావాలని చెప్పాడు. ఆ పదేళ్లు గడిచిపోయాయి. మహాభారతం గురించి కొత్త కబురేమీ లేదు. మహేష్ బాబుతో చేయనున్న సినిమా రెండు భాగాలంటున్నారు. అదెప్పటికి పూర్తవుతుందో.. రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలుపెడతాడో క్లారిటీ లేదు.
కానీ బాలీవుడ్లో మరో లెజెండ్ కూడా మహాభారతాన్ని ఒక మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నాడు. ఆయనే.. ఆమిర్ ఖాన్. ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు. రాజమౌళి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్టు అంటున్నా సరే.. ఆమిర్ తన ప్రయత్నాలేమీ ఆపట్లేదు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆమిర్. మహాభారతం గురించి ఆమిర్ స్పందిస్తూ.. “నా డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది.
ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఆ కథ మన భారతీయులుగా రక్తంలోనే ఉంది. కాబట్టి అది నా మీద బాధ్యతను పెంచుతోంది. దీన్ని ఏమాత్రం రాజీ లేకుండా, సరైన పద్ధతిలో రూపొందించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్టుతో భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. ప్రతి భారతీయుడూ గర్వించేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో లేదో తెలియదు. కానీ నేను మాత్రం దీని మీద పని చేయాలనుకుంటున్నా” అని ఆమిర్ అన్నాడు.
ఇది జరుగుతుందో లేదో అని ఆమిర్ పేర్కొనడంతో అతను ఈ ప్రాజెక్టు చేయడంపై కొంత సందేహాలు కలుగుతున్నాయి. రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టును ప్రకటిస్తే ఆమిర్ వెనక్కి తగ్గే అవకాశముంది. లేదంటే మాత్రం ప్రొసీడ్ కావచ్చు. ఇదిలా ఉండగా గతంలో తాను మూడేళ్లకు ఒక సినిమా చేసేవాడినని.. భవిష్యత్తులో ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నానని ఆమిర్ చెప్పడం విశేషం.
This post was last modified on December 17, 2024 10:33 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…