‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజై పది రోజులు దాటిపోయింది. ఈ తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వీక్ అయింది కానీ.. నార్త్ ఇండియాలో మాత్రం అదరగొట్టేస్తోంది. అక్కడ తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లలో దూసుకెళ్తోంది. పది రోజుల్లోపే ఐదొందల కోట్ల వసూళ్లతో ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అంతకుముందు అత్యధిక డే-1, వీకెండ్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగానూ పుష్ప-2 రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
అంతటితో ఆగకుండా మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోందీ చిత్రం. తాజాగా రెండో వీకెండ్లో వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా ‘పుష్ప-2’ రికార్డు నెలకొల్పడం విశేషం. గత శని, ఆదివారాల్లో కలిపి ఈ చిత్రం హిందీ వరకే రూ.128 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఏ హిందీ చిత్రం కూడా రెండో వీకెండ్లో వంద కోట్ల మార్కును కూడా అందుకోలేదు.
ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్లో విడుదలైన ‘స్త్రీ-’ సినిమా రూ.98 కోట్లతో రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డు ఇప్పుడు ‘పుష్ప-2’ రూ.30 కోట్ల తేడాతో బద్దలు కొట్టడం విశేషం. సమీప భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలు కూడా ఈ రికార్డును అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. ‘పుష్ప-2’కు తెలుగులో కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా సినిమా పడుతూ లేస్తూ సాగుతోంది. కానీ హిందీలో మాత్రం ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగుతోంది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు సాగిపోతోంది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్.. రెండో వీకెండ్లో కూడా టికెట్ల దొరక్క అభిమానులు ఎగబడుతున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. హిందీలో ఇప్పటికే ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా కూడా ఆశ్చర్యం లేదన్నది ట్రేడ్ వర్గాల మాట.
This post was last modified on December 16, 2024 6:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…