మంచు వారి కుటుంబ గొడవ కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుండగా.. మళ్లీ ఓ వివాదంతో ఆ ఫ్యామిలీ వార్తల్లోకి వచ్చింది. తన ఇంటి జనరేటర్లో తన అన్నయ్య మంచు విష్ణు చక్కెర పోసి కరెంట్ సరఫరా ఆగిపోయేలా చేశాడంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జల్పల్లిలో మనోజ్ ఉన్న ఇంటికి ఇటీవల తన మనుషులతో కలిసి వచ్చిన విష్ణు.. జనరేటర్లో చక్కెర పోసి అది పని చేయకుండా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇలా చేస్తే కరెంట్ పోయిన సమయంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతాననే ఉద్దేశంతోనే విష్ణు ఇలా చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. ఎప్పుడు ఏంటి అన్నది తెలియదు కానీ.. విష్ణు ఈ ఇంటికి తన మనుషులతో కలిసి వచ్చి లోపలికి వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను మనోజ్ మీడియాకు రిలీజ్ చేశాడు. అలాగే జనరేటర్లో పంచదార ఉన్న దృశ్యాలను కూడా మీడియాకు చూపించాడు మనోజ్.
గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో అంతర్గత గొడవలు మీడియాలో ఎంత చర్చనీయాంశంగా మారాయో తెలిసిందే. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో మీడియా దృష్టి అటు మళ్లగా.. మంచు ఫ్యామిలీ గురించి పెద్దగా వార్తలు లేవు. ఇరు వర్గాలు సైలెంట్ అయినట్లు కనిపించాయి.
తాను ఆవేశంలో దాడి చేయడం వల్ల గాయపడ్డ టీవీ9 కెమెరామన్ను తాజాగా మోహన్ బాబు.. విష్ణుతో కలిసి వెళ్లి పరామర్శించారు. దాడి విషయమై ఆయన క్షమాపణ చెబుతూ లేఖ కూడా విడుదల చేశారు. మోహన్ బాబు-విష్ణు… మనోజ్ మధ్య గొడవ సద్దుమణుగుతున్నట్లే కనిపించింది. ఇక ఆ టాపిక్ అందరూ మరిచిపోతున్నట్లే అనిపించింది. కానీ ఇప్పుడు మనోజ్ ఫిర్యాదుతో తిరిగి మీడియా దృష్టి అటు మళ్లింది. ఇంకా ఎన్నాళ్లూ ఈ వివాదం కొనసాగుతుంది.. విష్ణు-మనోజ్ రాజీకి రారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విష్ణు ఏమంటాడో చూడాలి.
This post was last modified on December 15, 2024 9:22 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…