తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. మామూలుగా ఒక సినిమా తర్వాత ఇంకోటి చేస్తుంటాడు. కానీ ఆయన చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టి కొంచెం ముందు వెనుకగా పూర్తి చేసేశాడు. సంక్రాంతికి రాబోతున్న ‘విడాముయర్చి’ షూట్ గత నెలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సినిమాను ముగించాక అజిత్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెండో సినిమా ముగింపు పనిలో పడిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఆ మూవీనే.. గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కనెక్షన్ ఉండడం విశేషం. ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అనదగ్గ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. విశాల్తో ‘మార్క్ ఆంటోనీ’ లాంటి హిట్ మూవీ చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో టాలీవుడ్ నటుడు సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అజిత్, సునీల్లతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆధిక్.
ఇందులో అజిత్ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. తన గత చిత్రాల్లో బాగా బరువు పెరిగినట్లు కనిపించిన అజిత్.. ఈ సినిమా కోసం స్లిమ్ లుక్లోకి మారిపోయాడు. గడ్డం కూడా తీసేసి లుక్ మార్చాడు. ఈ లుక్ చూస్తుంటే అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంకథ’ గుర్తుకు వస్తోంది. తెలుగులో ‘గ్యాంబ్లర్’ పేరుతో రిలీజైన ఆ చిత్రంలో అజిత్ చాలా స్టైలిష్గా కనిపించాడు. ఆ లుక్నే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో రిపీట్ చేసినట్లున్నాడు.
ఈ లుక్ చూసి తమను 13 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయాడంటూ అజిత్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘విడాముయర్చి’ రాకుంటే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇక సమ్మర్ రిలీజ్ ఫిక్స్ అనుకోవచ్చు.
This post was last modified on December 15, 2024 6:22 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…