తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. మామూలుగా ఒక సినిమా తర్వాత ఇంకోటి చేస్తుంటాడు. కానీ ఆయన చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టి కొంచెం ముందు వెనుకగా పూర్తి చేసేశాడు. సంక్రాంతికి రాబోతున్న ‘విడాముయర్చి’ షూట్ గత నెలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సినిమాను ముగించాక అజిత్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెండో సినిమా ముగింపు పనిలో పడిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఆ మూవీనే.. గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కనెక్షన్ ఉండడం విశేషం. ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అనదగ్గ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. విశాల్తో ‘మార్క్ ఆంటోనీ’ లాంటి హిట్ మూవీ చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో టాలీవుడ్ నటుడు సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అజిత్, సునీల్లతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆధిక్.
ఇందులో అజిత్ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. తన గత చిత్రాల్లో బాగా బరువు పెరిగినట్లు కనిపించిన అజిత్.. ఈ సినిమా కోసం స్లిమ్ లుక్లోకి మారిపోయాడు. గడ్డం కూడా తీసేసి లుక్ మార్చాడు. ఈ లుక్ చూస్తుంటే అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంకథ’ గుర్తుకు వస్తోంది. తెలుగులో ‘గ్యాంబ్లర్’ పేరుతో రిలీజైన ఆ చిత్రంలో అజిత్ చాలా స్టైలిష్గా కనిపించాడు. ఆ లుక్నే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో రిపీట్ చేసినట్లున్నాడు.
ఈ లుక్ చూసి తమను 13 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయాడంటూ అజిత్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘విడాముయర్చి’ రాకుంటే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇక సమ్మర్ రిలీజ్ ఫిక్స్ అనుకోవచ్చు.
This post was last modified on December 15, 2024 6:22 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…