ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సీరియస్ గా జరుగుతున్నాయని ముంబై టాక్. ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి కాగానే ప్రభాస్ దీని సెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసినట్టే. ఫైనల్ నెరేషన్ ఒకసారి అయ్యాక షెడ్యూల్స్ వేయబోతున్నారు. టి సిరీస్, భద్రకాళి జంట నిర్మాణంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఇప్పటికిప్పుడు అడ్వాన్సులు తీసుకున్నా వంద కోట్ల పైమాటే వచ్చేలా ఉంది. బాహుబలి హీరో, యానిమల్ డైరెక్టర్ కాంబినేషన్ తో క్రేజ్ మాములుగా ఉండదు కదా.
తాజాగా వస్తున్న లీక్ ఏంటంటే స్పిరిట్ లో డార్లింగ్ కు జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఓకే చేయొచ్చట. ప్రస్తుతానికి చర్చలు జరిగాయని, సందీప్ వంగా ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ రాసుకుంటారని తెలిసింది. తొలుత రెండు మూడు పేర్లు వినిపించాయి కానీ కథ ప్రకారం భార్య పాత్ర కాబట్టి తనైతేనే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఇంకోవైపు నిజ జీవిత జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ స్పిరిట్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం దాదాపు ఖరారే. ఆదిపురుష్ లో మిస్ అయిన టార్గెట్ ఈసారి ఖచ్చితంగా తగులుతుందని సైఫ్ నమ్మకంగా ఉన్నాడట.
పవన్ కళ్యాణ్ ఓజి లాగా ఇప్పుడీ స్పిరిట్ అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే విపరీతమైన హైప్ తెచ్చేసుకుంది. ఎంతకైనా తెగించే ఒక వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ కథని ఇందులో చూపించబోతున్న క్లూ అయితే సందీప్ ఇచ్చాడు కానీ ట్రీట్ మెంట్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూడనంత డిఫరెంట్ గా హీరో క్యారెక్టరైజేషన్ ఆశించవచ్చు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. ఓ రెండు ట్యూన్స్ ఓకే అయ్యాయట. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రకటన రాకముందే స్పిరిట్ తాలూకు ఏఐ ఇమేజెస్ ఎక్స్ లాంటి మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
This post was last modified on December 14, 2024 5:34 pm
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…