Movie News

న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది : మీడియా తో బన్నీ!

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది తనకు సంఘీభావం ప్రకటించారని, అన్ని చిత్ర పరిశ్రమల నుంచి చాలామంది వ్యక్తులు, అభిమానులు తనకు మద్దతునిచ్చారని, వారందరికీ ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసులు, అధికారులకు సహకరిస్తానని అన్నారు.

మృతురాలు రేవతి కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఆ ఘటన జరగడం దురదష్టమని, అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ కు 20 ఏళ్లుగా వెళుతున్నానని, తన సినిమాలతో పాటు మిగతా సినిమాలు చూసేందుకు దాదాపు 30 సార్లు అక్కడకు వెళ్లి ఉంటానని అన్నారు. కానీ, ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అన్నారు. చనిపోయిన రేవతి గారిని తిరిగి తీసుకురలేమని, కానీ, ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, వారిని ఆదుకుంటానని చెప్పారు.

చట్టంపై తనకు నమ్మకుందని అన్నారు. తాను బాగున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని. తన కుటుంబానికి కూడా ఇది కష్ట సమయం అని, తాను అరెస్టు కావడంతో వారు చాలా బాధపడ్డారని చెప్పారు. లీగల్ అంశాల గురించి తాను ఏమీ మాట్లాడకూడదని, మాట్లాడబోనని అన్నారు. తనకు ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

This post was last modified on December 14, 2024 9:58 am

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

1 hour ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

2 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

3 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

4 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago