చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది తనకు సంఘీభావం ప్రకటించారని, అన్ని చిత్ర పరిశ్రమల నుంచి చాలామంది వ్యక్తులు, అభిమానులు తనకు మద్దతునిచ్చారని, వారందరికీ ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసులు, అధికారులకు సహకరిస్తానని అన్నారు.
మృతురాలు రేవతి కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఆ ఘటన జరగడం దురదష్టమని, అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ కు 20 ఏళ్లుగా వెళుతున్నానని, తన సినిమాలతో పాటు మిగతా సినిమాలు చూసేందుకు దాదాపు 30 సార్లు అక్కడకు వెళ్లి ఉంటానని అన్నారు. కానీ, ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అన్నారు. చనిపోయిన రేవతి గారిని తిరిగి తీసుకురలేమని, కానీ, ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, వారిని ఆదుకుంటానని చెప్పారు.
చట్టంపై తనకు నమ్మకుందని అన్నారు. తాను బాగున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని. తన కుటుంబానికి కూడా ఇది కష్ట సమయం అని, తాను అరెస్టు కావడంతో వారు చాలా బాధపడ్డారని చెప్పారు. లీగల్ అంశాల గురించి తాను ఏమీ మాట్లాడకూడదని, మాట్లాడబోనని అన్నారు. తనకు ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on December 14, 2024 9:58 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…