గడిచిన కొన్ని గంటలు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనోళ్లందరిని అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుకునేలా చేశాయి. పుష్ప 2ని మించిన డ్రామా నిజ జీవితంలో జరగడం చూసి సోషల్ మీడియా మొత్తం దీనివైపే దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయని ఏవేవో ప్రచారాలు జరగడం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేచోట కలుసుకునే సందర్భం రాకపోవడం దీన్ని మరింత బలపరిచింది. ఆ మధ్య నాగబాబు వేసిన కొన్ని ట్వీట్లకు విపరీత అర్థాలు తీసి విచిత్ర నిర్వచనాలు ఇచ్చినవాళ్లు లేకపోలేదు.
ఇప్పుడు మొత్తం మారిపోయింది. అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ విశ్వంభర షూటింగ్ అప్పటికప్పుడు రద్దు చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చేశారు. నిజానికి పోలీస్ స్టేషన్ కే వెళ్లాలనుకున్నారు కానీ పోలీసులు సెక్యూరిటీ కారణాలు చూపడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఏపీలో విజన్ వేడుకలో ఉన్న పవన్ కళ్యాణ్ అది పూర్తి కావడం ఆలస్యం ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ వస్తారో? లేక బెయిలు రావడంతో ఆగిపోతారో తెలియాల్సి ఉంది. కాలు బాలేక ఆరోగ్యం సహకరించకపోయినా నాగబాబు అన్నయ్యతో పాటు బన్నీ ఇంట్లోనే ఉన్నారు. రామ్ చరణ్ ఏ క్షణమైనా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయి తేజ్, వరుణ్, వైష్ణవ్ అందరూ వెళ్తారు.
ఇదంతా మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటేననే సంకేతం ఇస్తోందని అభిమానుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కోసం ముందుగా కదిలింది మావయ్యేనని ట్వీట్ చేస్తున్నారు. లాయర్ నిరంజన్ రెడ్డిని రిఫర్ చేసింది కూడా ఆయనేనని ఇన్ సైడ్ టాక్. చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆపద వచ్చినప్పుడు అందరూ ఏకమైపోతామనే సందేశం ఇవాళ రెండు ఫ్యామిలీస్ స్పష్టంగా ఇచ్చేశాయి. రాబోయే రోజుల్లో ఈ ఘటన గురించి ఒక్కొక్కరు స్పందించే వేదిక వేర్వేరుగా అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. లేనిపోని ఆన్ లైన్ వార్స్ తో మునిగిపోయే ఫ్యాన్స్ కు ఇవాళ జరిగిన బన్నీ అరెస్ట్ ఉదంతం హ్యాపీగా ముగిసిన ఫ్యామిలీ సినిమాగా అనిపించింది.
This post was last modified on December 13, 2024 7:24 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…