టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు ముదరడంతో ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ అయింది. ఆ క్రమంలోనే కవరేజికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్పై మోహన్ బాబు దాడి చేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది.
తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయనను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మోహన్ బాబు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే, అదే సమయంలో హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
కాగా, టీవీ9 రిపోర్టర్ రంజిత్ తో పాటు టీవీ9 మీడియాకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలా జరిగిపోయిందని అన్నారు. కానీ, అప్పటికీ ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు తప్పేలా కనిపించడం లేదు.
This post was last modified on December 13, 2024 6:00 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…