టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు ముదరడంతో ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ అయింది. ఆ క్రమంలోనే కవరేజికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్పై మోహన్ బాబు దాడి చేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది.
తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయనను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మోహన్ బాబు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే, అదే సమయంలో హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
కాగా, టీవీ9 రిపోర్టర్ రంజిత్ తో పాటు టీవీ9 మీడియాకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలా జరిగిపోయిందని అన్నారు. కానీ, అప్పటికీ ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు తప్పేలా కనిపించడం లేదు.
This post was last modified on December 13, 2024 6:00 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…