టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు ముదరడంతో ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ అయింది. ఆ క్రమంలోనే కవరేజికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్పై మోహన్ బాబు దాడి చేయడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది.
తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయనను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మోహన్ బాబు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే, అదే సమయంలో హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.
కాగా, టీవీ9 రిపోర్టర్ రంజిత్ తో పాటు టీవీ9 మీడియాకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలా జరిగిపోయిందని అన్నారు. కానీ, అప్పటికీ ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు తప్పేలా కనిపించడం లేదు.
This post was last modified on December 13, 2024 6:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…