టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.
ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates