డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడం దాదాపు ఖరారే. అధికారికంగా ప్రకటించలేదు కానీ నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. పుష్ప 2 వేడితో పాటు విపరీతమైన పోటీ ఉండటం వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని భావించి ఆ మేరకు జనవరికి వాయిదా వేశారని తెలిసింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13 రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. పొయ్యి నుంచి పెనంలో పడ్డట్టు నితిన్ అక్కడ రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి పెద్ద కాంపిటీషన్ ని తట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా ఎందుకు చేశారనే దానికి కారణాలు లేకపోలేదు.
అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ కోసం మైత్రి సంస్థ తమ థియేటర్లు, స్క్రీన్లు అవసరమైన మేరకు ముందస్తుగానే లాక్ చేసి ఉంచింది. ఇప్పుడది రావడం లేదు కాబట్టి అవన్నీ రాబిన్ హుడ్ కి ఇచ్చేయొచ్చు. పైగా పుష్ప 2 ది రూల్ నడిపిస్తున్న ఎగ్జిబిటర్ల నుంచి ఎలాగూ సహకారం ఉంటుంది. సో పోటీ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. పైగా గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిలతో తలపడి శతమానంభవతి లాంటి ఫ్యామిలీ మూవీ విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ రాబిన్ హుడ్ తో రిస్క్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వినిపిస్తోంది. అఫీషియల్ కావాల్సి ఉంది.
ఒకరకంగా నితిన్ తప్పుకోవడం మంచిదే అనిపిస్తున్నప్పటికీ కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉంటేనే రాబిన్ హుడ్ సంక్రాంతికి వసూళ్లు రాబట్టగలడు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంకు వచ్చే టాక్స్ కీలకం కాబోతున్నాయి. చలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడం, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చడం లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి. పైన చెప్పిందే నిజమైన పక్షంలో సంక్రాంతికి రోజుకొక సినిమా చొప్పున మూవీ లవర్స్ కి కన్నులపండగే. వరస ఫ్లాపుల నుంచి ఇది గట్టెక్కించి బ్లాక్ బస్టర్ ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు.
This post was last modified on December 13, 2024 11:15 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…