గత నాలుగైదు రోజులుగా మీడియాలో హోరెత్తిపోయిన మంచు కుటుంబం గొడవ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ గాయపడటం ద్వారా కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆవేశంలో మోహన్ బాబు మైకుతో కొట్టడం వల్ల సదరు జర్నలిస్టు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయం లేకపోయినా సర్జరి అవసరమైన నేపథ్యంలో ఈ ఘటన పట్ల మీడియా సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. విష్ణు నిన్న మాట్లాడుతూ ఆ స్థానంలో మీ తండ్రి ఉన్నా ఇదే చేసేవారని చెప్పడం, జరిగింది వివరించే ప్రయత్నం చేయడం చూశాం. తాజాగా మరో కీలక మలుపు.
అనుకోకుండా జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత నలభై ఎనిమిది గంటలుగా ఆసుపత్రిలో ఉండటం వల్ల స్పందించడం ఆలస్యమయ్యిందని, మూకుమ్మడిగా 30 నుంచి 50 మంది తన ఇంటి గేట్లు తోసుకుని లోపలి వచ్చినప్పుడు అందులో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉండటం వల్ల, తోపులాటలో దురదృష్టవశాత్తు విలేఖరి రంజిత్ గాయపడటం జరిగిందని, దీనికి గాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని అందులో పేర్కొన్నారు. పూర్తి వివరణతో మోహన్ బాబు ఇచ్చిన ఈ లేఖతో వివాదం ముగిసినట్టే అనుకోవాలి.
ఇప్పటికే విష్ణు, మనోజ్ లు సిపిని కలిసి ఇకపై ఎలాంటి రాద్ధాంతం జరగదని హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం కూడదంటూ కోర్టు సైతం అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడినుంచి ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చలు ఉండకపోవచ్చు. మనోజ్ ఆల్రెడీ భైరవం షూటింగ్ లో చేరిపోగా విష్ణు దగ్గరుండి తండ్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆ మీడియా ఛానల్ ఇప్పుడీ పరిణామం పట్ల సానుకూలంగా స్పందించే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి కథ కంచికి చేరినట్టు మంచు ఫ్యామిలీ వివాదం ఎట్టకేలకు పెద్దాయన సారీతో క్లైమాక్స్ కు చేరింది. ఇక జరగాల్సింది శుభమే.
This post was last modified on December 13, 2024 11:09 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…