గత నాలుగైదు రోజులుగా మీడియాలో హోరెత్తిపోయిన మంచు కుటుంబం గొడవ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ గాయపడటం ద్వారా కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆవేశంలో మోహన్ బాబు మైకుతో కొట్టడం వల్ల సదరు జర్నలిస్టు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయం లేకపోయినా సర్జరి అవసరమైన నేపథ్యంలో ఈ ఘటన పట్ల మీడియా సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. విష్ణు నిన్న మాట్లాడుతూ ఆ స్థానంలో మీ తండ్రి ఉన్నా ఇదే చేసేవారని చెప్పడం, జరిగింది వివరించే ప్రయత్నం చేయడం చూశాం. తాజాగా మరో కీలక మలుపు.
అనుకోకుండా జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత నలభై ఎనిమిది గంటలుగా ఆసుపత్రిలో ఉండటం వల్ల స్పందించడం ఆలస్యమయ్యిందని, మూకుమ్మడిగా 30 నుంచి 50 మంది తన ఇంటి గేట్లు తోసుకుని లోపలి వచ్చినప్పుడు అందులో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉండటం వల్ల, తోపులాటలో దురదృష్టవశాత్తు విలేఖరి రంజిత్ గాయపడటం జరిగిందని, దీనికి గాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని అందులో పేర్కొన్నారు. పూర్తి వివరణతో మోహన్ బాబు ఇచ్చిన ఈ లేఖతో వివాదం ముగిసినట్టే అనుకోవాలి.
ఇప్పటికే విష్ణు, మనోజ్ లు సిపిని కలిసి ఇకపై ఎలాంటి రాద్ధాంతం జరగదని హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం కూడదంటూ కోర్టు సైతం అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడినుంచి ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చలు ఉండకపోవచ్చు. మనోజ్ ఆల్రెడీ భైరవం షూటింగ్ లో చేరిపోగా విష్ణు దగ్గరుండి తండ్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆ మీడియా ఛానల్ ఇప్పుడీ పరిణామం పట్ల సానుకూలంగా స్పందించే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి కథ కంచికి చేరినట్టు మంచు ఫ్యామిలీ వివాదం ఎట్టకేలకు పెద్దాయన సారీతో క్లైమాక్స్ కు చేరింది. ఇక జరగాల్సింది శుభమే.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…