గత నాలుగైదు రోజులుగా మీడియాలో హోరెత్తిపోయిన మంచు కుటుంబం గొడవ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ గాయపడటం ద్వారా కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆవేశంలో మోహన్ బాబు మైకుతో కొట్టడం వల్ల సదరు జర్నలిస్టు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయం లేకపోయినా సర్జరి అవసరమైన నేపథ్యంలో ఈ ఘటన పట్ల మీడియా సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. విష్ణు నిన్న మాట్లాడుతూ ఆ స్థానంలో మీ తండ్రి ఉన్నా ఇదే చేసేవారని చెప్పడం, జరిగింది వివరించే ప్రయత్నం చేయడం చూశాం. తాజాగా మరో కీలక మలుపు.
అనుకోకుండా జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత నలభై ఎనిమిది గంటలుగా ఆసుపత్రిలో ఉండటం వల్ల స్పందించడం ఆలస్యమయ్యిందని, మూకుమ్మడిగా 30 నుంచి 50 మంది తన ఇంటి గేట్లు తోసుకుని లోపలి వచ్చినప్పుడు అందులో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉండటం వల్ల, తోపులాటలో దురదృష్టవశాత్తు విలేఖరి రంజిత్ గాయపడటం జరిగిందని, దీనికి గాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని అందులో పేర్కొన్నారు. పూర్తి వివరణతో మోహన్ బాబు ఇచ్చిన ఈ లేఖతో వివాదం ముగిసినట్టే అనుకోవాలి.
ఇప్పటికే విష్ణు, మనోజ్ లు సిపిని కలిసి ఇకపై ఎలాంటి రాద్ధాంతం జరగదని హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం కూడదంటూ కోర్టు సైతం అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడినుంచి ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చలు ఉండకపోవచ్చు. మనోజ్ ఆల్రెడీ భైరవం షూటింగ్ లో చేరిపోగా విష్ణు దగ్గరుండి తండ్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆ మీడియా ఛానల్ ఇప్పుడీ పరిణామం పట్ల సానుకూలంగా స్పందించే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి కథ కంచికి చేరినట్టు మంచు ఫ్యామిలీ వివాదం ఎట్టకేలకు పెద్దాయన సారీతో క్లైమాక్స్ కు చేరింది. ఇక జరగాల్సింది శుభమే.
This post was last modified on December 13, 2024 11:09 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…