Movie News

ఆంజనేయస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా… : రామ్ చరణ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు టీజర్ లాంచ్ కార్నేజ్ పేరుతో ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడంతో అభిమానులు భారీ ఎత్తున విచ్చేశారు. మెగా పవర్ స్టార్, సుప్రీమ్ హీరో కలయిక కోసం ప్రాంగణాన్ని నింపేశారు. టాలీవుడ్ కు సంబంధించిన పలువురు దర్శకులతో పాటు టీమ్ మొత్తం హాజరయ్యింది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ కనిపించే పబ్లిక్ స్టేజి కావడంతో స్వామి స్పీచ్ మీదే అందరి దృష్టి నెలకొంది. మాములుగా కొంచెం పొడిగా మాట్లాడే చరణ్ ఈసారి మంచి చలాకీగా హ్యూమర్ జోడించి మరీ హుషారునిచ్చాడు.

తన మాటల్లో ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. “ఇవాళ సాయిధరమ్ తేజ్ మన ముందు ఉన్నాడంటే ఆంజనేయస్వామి మీద ఒట్టు అది మీరిచ్చిన ఆశీర్వాదమే. ఇది చెప్పాలా వద్దాని చాలాసార్లు అనుకున్నా కానీ మీ ప్రేమను చూశాక పంచుకోవాలనిపించింది. మీరంతా అభిమానులు కాదు బంగారు అభిమానులు. ఒకటే మాట చెబుతున్నా. సంబరాల ఏటిగట్టులో తేజు ఊచకోత ఎలా ఉండబోతోందో చూస్తారు. దర్శకుడు రోహిత్ కు ముందస్తు శుభాకాంక్షలు. తేజుది బండప్రేమ. పట్టుకుంటే వదలడు. కానీ ఎప్పుడూ మగాళ్ల మీదే చూపిస్తాడు. అమ్మాయిలకు పంచమంటాను. వాళ్ళమ్మ వీడి పెళ్లి గురించే ఆలోచిస్తోంది”

ఇలా సాగింది రామ్ చరణ్ స్పీచ్. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే చరణ్ స్వామి జోష్ ఇచ్చారు. సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాతలు భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ ఎలిమెంట్ కావడంతో భారీ విఎఫెక్స్ అవసరమవుతోంది. అందుకే రిలీజ్ విషయంలో తొందరపడకుండా పది నెలల తర్వాత ప్లాన్ చేసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో గత సినిమాకు దీనికి గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే సాయి ధరమ్ తేజ్ దానికే కట్టుబడ్డాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మైథలాజి థ్రిల్లర్ కు విరూపాక్ష – మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

This post was last modified on December 12, 2024 10:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago