సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు టీజర్ లాంచ్ కార్నేజ్ పేరుతో ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడంతో అభిమానులు భారీ ఎత్తున విచ్చేశారు. మెగా పవర్ స్టార్, సుప్రీమ్ హీరో కలయిక కోసం ప్రాంగణాన్ని నింపేశారు. టాలీవుడ్ కు సంబంధించిన పలువురు దర్శకులతో పాటు టీమ్ మొత్తం హాజరయ్యింది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ కనిపించే పబ్లిక్ స్టేజి కావడంతో స్వామి స్పీచ్ మీదే అందరి దృష్టి నెలకొంది. మాములుగా కొంచెం పొడిగా మాట్లాడే చరణ్ ఈసారి మంచి చలాకీగా హ్యూమర్ జోడించి మరీ హుషారునిచ్చాడు.
తన మాటల్లో ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. “ఇవాళ సాయిధరమ్ తేజ్ మన ముందు ఉన్నాడంటే ఆంజనేయస్వామి మీద ఒట్టు అది మీరిచ్చిన ఆశీర్వాదమే. ఇది చెప్పాలా వద్దాని చాలాసార్లు అనుకున్నా కానీ మీ ప్రేమను చూశాక పంచుకోవాలనిపించింది. మీరంతా అభిమానులు కాదు బంగారు అభిమానులు. ఒకటే మాట చెబుతున్నా. సంబరాల ఏటిగట్టులో తేజు ఊచకోత ఎలా ఉండబోతోందో చూస్తారు. దర్శకుడు రోహిత్ కు ముందస్తు శుభాకాంక్షలు. తేజుది బండప్రేమ. పట్టుకుంటే వదలడు. కానీ ఎప్పుడూ మగాళ్ల మీదే చూపిస్తాడు. అమ్మాయిలకు పంచమంటాను. వాళ్ళమ్మ వీడి పెళ్లి గురించే ఆలోచిస్తోంది”
ఇలా సాగింది రామ్ చరణ్ స్పీచ్. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే చరణ్ స్వామి జోష్ ఇచ్చారు. సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాతలు భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ ఎలిమెంట్ కావడంతో భారీ విఎఫెక్స్ అవసరమవుతోంది. అందుకే రిలీజ్ విషయంలో తొందరపడకుండా పది నెలల తర్వాత ప్లాన్ చేసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో గత సినిమాకు దీనికి గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే సాయి ధరమ్ తేజ్ దానికే కట్టుబడ్డాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మైథలాజి థ్రిల్లర్ కు విరూపాక్ష – మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…