Movie News

సంధ్య థియేటర్ ఘటన.. హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఘటనకు సంబంధించి భద్రతా లోపాల కారణంగా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతా చర్యలు సరిగా చేపట్టలేదని ఆరోపణలు రావడంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోనూ చర్చనీయాంశమైంది.

అయితే తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ చేపట్టనుంది. ఇక ఈ కేసు పరిశీలన ఫలితంపై అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు సంధ్య థియేటర్ యజమాని కూడా హైకోర్టుని ఆశ్రయించారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదని అతను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.

This post was last modified on December 11, 2024 7:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

16 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago