ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఘటనకు సంబంధించి భద్రతా లోపాల కారణంగా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా చర్యలు సరిగా చేపట్టలేదని ఆరోపణలు రావడంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లోనూ చర్చనీయాంశమైంది.
అయితే తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు ఈ పిటిషన్పై త్వరలో విచారణ చేపట్టనుంది. ఇక ఈ కేసు పరిశీలన ఫలితంపై అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు సంధ్య థియేటర్ యజమాని కూడా హైకోర్టుని ఆశ్రయించారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదని అతను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.
This post was last modified on December 11, 2024 7:43 pm
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు…
ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా…
నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన…