సూపర్ స్టార్ రజనీకాంత్ కూలిలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటిస్తుండటం ముందే లీకైన వార్త అయినప్పటికీ తాజాగా జరుగుతున్న షూటింగ్ లో ఇద్దరూ కలుసుకోవడంతో అధికారిక ముద్ర పడిపోయింది. నిజానికీ న్యూస్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ సీక్రెట్ గా ఉంచి థియేటర్లో రోలెక్స్ తరహాలో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. కానీ ఈలోగా లీకులు చక్కర్లు కొట్టేయడంతో వాటిని కట్టడి చేయడం సాధ్యపడలేదు. ఇప్పటికే తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్రలను తీసుకొచ్చి కూలిని మల్టీస్టారర్ చేసిన లోకేష్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ తో ఎలాంటి పాత్ర చేయిస్తాడోననే ఆసక్తి విపరీతంగా నెలకొంది.
అయితే రజని, ఆమిర్ కాంబో మొదటిసారి కాదు. ముప్పై సంవత్సరాల క్రితం 1995లో ఆటంక్ హీ ఆటంక్ లో చేశారు. దిలీప్ శంకర్ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ స్ఫూర్తితో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేక ఫెయిల్యూర్ గా నిలిచింది. తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆమిర్ మాట్లాడుతూ తన నటన తనకే నచ్చలేదని, ఆటంక్ హీ ఆటంక్ చేయకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు. అయిదేళ్ల తర్వాత 2000లో సపోర్టింగ్ ఆర్టిస్టులతో కొంత భాగం రీ షూట్ చేసి తమిళంలో పొన్వన్నన్ గా డబ్బింగ్ చేస్తే అక్కడా ఘోర పరాజయం మూటగట్టుకుంది.
ఇంత ట్రాక్ రికార్డు రజని, అమీర్ కలయికకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అడగాలే కానీ సౌత్ సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లాల్ సింగ్ చద్దా హైదరాబాద్ ప్రమోషన్లలో చెప్పిన ఆమిర్ ఖాన్ అన్నట్టుగానే కూలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కా కపోయినా చాలా కీలకమై దశలో వస్తుందని అంటున్నారు. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో భాగం కాదు అని స్టాండ్ అలోన్ సినిమా అని లోకేష్ ముందే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. 2025 వేసవి విడుదలకు రెడీ అవుతున్న కూలి కోలీవుడ్ కు పుష్ప తరహాలో ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కంటెంట్ బాగుంటే అదే జరుగుతుంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…