డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడిందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. మైత్రి నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా పోస్ట్ పోన్ చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. పుష్ప 2 ది రూల్ దూకుడు ఇంకా తగ్గకపోవడం, దుబాయ్ తదితర దేశాల్లో సక్సెస్ మీట్లు ప్లాన్ చేయడం లాంటి కారణాలు రాబిన్ హుడ్ ప్రమోషన్లకు ప్రతిబంధకంగా మారొచ్చని భావిస్తున్నారట. పైగా పుష్ప 2 అగ్రిమెంట్ చేసుకున్న చాలా థియేటర్లు మూడో వారం కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. టికెట్ రేట్లు సాధారణమవుతాయి కాబట్టి భారీ పికప్ ఉంటుందనే నమ్మకంతో.
రాబిన్ హుడ్ ఒకవేళ క్రిస్మస్ డేట్ మిస్ చేసుకుంటే సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో తలపడటం అంత సులభం కాదు. ఎంత మైత్రి అయినా సరే క్రేజ్ పరంగా చూసుకుంటే నితిన్ పైన ముగ్గురితో సరితూగలేడు. పోనీ ఇంకా లేట్ గా వద్దామంటే జనవరి చివరికి వెళ్ళిపోవాలి. అందుకే నితిన్ వాయిదా వద్దని వారిస్తున్నట్టు తెలిసింది. ఈ కన్ఫ్యూజన్ లోనే ఐటెం సాంగ్ రిలీజ్ లేట్ అయ్యిందనేది ఒక వెర్షన్. నిజానికి రాబిన్ హుడ్ మీద విపరీతమైన హైప్ లేదు. ఇకపై పెంచాలి. టీజర్ ఫన్నీగా అనిపించింది కానీ బజ్ పెంచేందుకు సరిపోలేదు.
మరి రాబిన్ హుడ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మైత్రి ఇంకో కోణంలో కూడా ఆలోచించి ఉండొచ్చు. డిసెంబర్ 20, 25 తేదీలలో విపరీతమైన పోటీ ఉంది. అరడజను సినిమాలు తలపడుతున్నాయి. పుష్ప 2 కంటిన్యూటీతో పాటు కొత్త వాటికి స్క్రీన్ల సర్దుబాటు ఎగ్జిబిటర్లకు పెద్ద సవాలే. ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, అల్లరి నరేష్ బచ్చల మల్లికు సపోర్ట్ బాగానే ఉంది. ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే రాబిన్ హుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాయిదా నిజమైతే మాత్రం ఫ్యాన్స్ అంతా మన మంచికే అనుకోవాలి. లేదంటే క్రిస్మస్ కి సిద్ధమైపోవాలి.
This post was last modified on December 11, 2024 11:02 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…