డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడిందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. మైత్రి నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా పోస్ట్ పోన్ చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. పుష్ప 2 ది రూల్ దూకుడు ఇంకా తగ్గకపోవడం, దుబాయ్ తదితర దేశాల్లో సక్సెస్ మీట్లు ప్లాన్ చేయడం లాంటి కారణాలు రాబిన్ హుడ్ ప్రమోషన్లకు ప్రతిబంధకంగా మారొచ్చని భావిస్తున్నారట. పైగా పుష్ప 2 అగ్రిమెంట్ చేసుకున్న చాలా థియేటర్లు మూడో వారం కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. టికెట్ రేట్లు సాధారణమవుతాయి కాబట్టి భారీ పికప్ ఉంటుందనే నమ్మకంతో.
రాబిన్ హుడ్ ఒకవేళ క్రిస్మస్ డేట్ మిస్ చేసుకుంటే సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో తలపడటం అంత సులభం కాదు. ఎంత మైత్రి అయినా సరే క్రేజ్ పరంగా చూసుకుంటే నితిన్ పైన ముగ్గురితో సరితూగలేడు. పోనీ ఇంకా లేట్ గా వద్దామంటే జనవరి చివరికి వెళ్ళిపోవాలి. అందుకే నితిన్ వాయిదా వద్దని వారిస్తున్నట్టు తెలిసింది. ఈ కన్ఫ్యూజన్ లోనే ఐటెం సాంగ్ రిలీజ్ లేట్ అయ్యిందనేది ఒక వెర్షన్. నిజానికి రాబిన్ హుడ్ మీద విపరీతమైన హైప్ లేదు. ఇకపై పెంచాలి. టీజర్ ఫన్నీగా అనిపించింది కానీ బజ్ పెంచేందుకు సరిపోలేదు.
మరి రాబిన్ హుడ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మైత్రి ఇంకో కోణంలో కూడా ఆలోచించి ఉండొచ్చు. డిసెంబర్ 20, 25 తేదీలలో విపరీతమైన పోటీ ఉంది. అరడజను సినిమాలు తలపడుతున్నాయి. పుష్ప 2 కంటిన్యూటీతో పాటు కొత్త వాటికి స్క్రీన్ల సర్దుబాటు ఎగ్జిబిటర్లకు పెద్ద సవాలే. ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, అల్లరి నరేష్ బచ్చల మల్లికు సపోర్ట్ బాగానే ఉంది. ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే రాబిన్ హుడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాయిదా నిజమైతే మాత్రం ఫ్యాన్స్ అంతా మన మంచికే అనుకోవాలి. లేదంటే క్రిస్మస్ కి సిద్ధమైపోవాలి.
This post was last modified on December 11, 2024 11:02 am
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…