ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసినప్పుడు మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కొనసాగింపు చేయాలన్న రూల్ లేదు. దర్శక రచయితలు తమకు అనుకూలంగా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు ఏం కావాలో అలా రాసుకుంటారు. ఇదే కేరళలోని ఒక థియేటర్ రచ్చకు కారణమయ్యింది. మూడు రోజుల క్రితం డిసెంబర్ ఆరున కేరళలోని సినీపోలీస్ సెంటర్ స్క్వేర్ మాల్ లో ఈవెనింగ్ షోకు ఆడియన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. బన్నీకున్న క్రేజ్ దృష్ట్యా దాదాపు హౌస్ ఫుల్ అయిపోయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా. అసలు ట్విస్ట్ చూద్దాం.
షో మొదలయ్యాక ఇంటర్వెల్ దగ్గర పడుతున్న టైంలో హఠాత్తుగా ఎండ్ టైటిల్ కార్డ్స్ వచ్చేసాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. జరిగిందేంటంటే ప్రొజెక్టర్ ఆపరేటర్ తప్పిదం వల్ల ముందు సెకండాఫ్ ప్లే చేశారు. తీరా గంట నలభై నిమిషాల తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. దీంతో పబ్లిక్ గోల చేయడం జరిగింది. తమ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ నిరసన ప్రకటించారు. దీంతో యాజమాన్యం పూర్తి సినిమా చూసేందుకు సిద్ధపడ్డ పది మందికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ నుంచి షో వేసేందుకు అంగీకరించింది. మిగిలినవాళ్లకు రీ ఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది.
లాజికల్ గా చూస్తే సినిమా చూడని వాళ్లకు రెండో సగం నుంచి పుష్ప 2 వేసినా అంత సులభంగా గుర్తు పట్టలేరు. ఇదంతా కథలో భాగమేమో తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుందేమో అనుకుంటారు. గతంలో రెండు మూడు చోట్ల ఈ తరహా ఉదంతాలు జరిగాయి కానీ పుష్ప 2 ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా గంటన్నరకు పైగా ఆడియన్స్ తాము చూస్తున్నది సెకండాఫ్ అని గుర్తుపట్టలేనంత లీనమయ్యారంటే ఇది కూడా ఒకరకంగా అల్లు అర్జున్, సుకుమార్ మ్యాజిక్ అనుకోవాలి. అంతగా పెర్ఫార్మన్స్, టేకింగ్ తో కట్టిపడేశారు మరి.
This post was last modified on December 9, 2024 4:56 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…