ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసినప్పుడు మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కొనసాగింపు చేయాలన్న రూల్ లేదు. దర్శక రచయితలు తమకు అనుకూలంగా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు ఏం కావాలో అలా రాసుకుంటారు. ఇదే కేరళలోని ఒక థియేటర్ రచ్చకు కారణమయ్యింది. మూడు రోజుల క్రితం డిసెంబర్ ఆరున కేరళలోని సినీపోలీస్ సెంటర్ స్క్వేర్ మాల్ లో ఈవెనింగ్ షోకు ఆడియన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. బన్నీకున్న క్రేజ్ దృష్ట్యా దాదాపు హౌస్ ఫుల్ అయిపోయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా. అసలు ట్విస్ట్ చూద్దాం.
షో మొదలయ్యాక ఇంటర్వెల్ దగ్గర పడుతున్న టైంలో హఠాత్తుగా ఎండ్ టైటిల్ కార్డ్స్ వచ్చేసాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. జరిగిందేంటంటే ప్రొజెక్టర్ ఆపరేటర్ తప్పిదం వల్ల ముందు సెకండాఫ్ ప్లే చేశారు. తీరా గంట నలభై నిమిషాల తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. దీంతో పబ్లిక్ గోల చేయడం జరిగింది. తమ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ నిరసన ప్రకటించారు. దీంతో యాజమాన్యం పూర్తి సినిమా చూసేందుకు సిద్ధపడ్డ పది మందికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ నుంచి షో వేసేందుకు అంగీకరించింది. మిగిలినవాళ్లకు రీ ఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది.
లాజికల్ గా చూస్తే సినిమా చూడని వాళ్లకు రెండో సగం నుంచి పుష్ప 2 వేసినా అంత సులభంగా గుర్తు పట్టలేరు. ఇదంతా కథలో భాగమేమో తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుందేమో అనుకుంటారు. గతంలో రెండు మూడు చోట్ల ఈ తరహా ఉదంతాలు జరిగాయి కానీ పుష్ప 2 ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా గంటన్నరకు పైగా ఆడియన్స్ తాము చూస్తున్నది సెకండాఫ్ అని గుర్తుపట్టలేనంత లీనమయ్యారంటే ఇది కూడా ఒకరకంగా అల్లు అర్జున్, సుకుమార్ మ్యాజిక్ అనుకోవాలి. అంతగా పెర్ఫార్మన్స్, టేకింగ్ తో కట్టిపడేశారు మరి.
This post was last modified on December 9, 2024 4:56 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…