తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా నిశ్శబ్దం. కానీ ఆ చిత్రం ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ నెల 2న అమేజాన్ ప్రైమ్లో రిలీజైన నిశ్శబ్దం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయిన విషయం మాధవన్ పాత్రను సైకోలా చూపించడం. ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులకు ఎంతమాత్రం కన్విన్సింగ్గా అనిపించలేదు.
ఈ విషయంలో పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా మాధవన్ ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేయగా.. ఒక నెటిజన్ దాని గురించి ప్రస్తావించాడు. సినిమాలో ఆంటోనీ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కన్విన్సింగ్గా లేదని, దీనిపై మీరేమంటారని అడిగాడు.
దీనికి మాధవన్ బదులిస్తూ.. ఇప్పుడు నేను కేవలం క్షమాపణ మాత్రమే చెప్పగను అన్నాడు. నిశ్శబ్దం కథ నచ్చి చేశారా, ఈ సినిమాలో నటించాలని నటించారా అని అడిగితే.. కొన్నిసార్లు సినిమాలు ఆడతాయి, కొన్నిసార్లు ఆడవు.. మా వంతు కృషి మేం చేశాం అంటూ నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు మాధవన్.
నిశ్శబ్దం సినిమా విడుదల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావడం చికాకు పెట్టిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు మాధవన్. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్సే ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమాలో పాజిటివ్ రోల్లో చూడబోతున్నారని బదులిచ్చాడతను. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు మాధవన్ చెప్పాడు.
This post was last modified on October 10, 2020 8:54 am
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…