తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా నిశ్శబ్దం. కానీ ఆ చిత్రం ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ నెల 2న అమేజాన్ ప్రైమ్లో రిలీజైన నిశ్శబ్దం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయిన విషయం మాధవన్ పాత్రను సైకోలా చూపించడం. ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులకు ఎంతమాత్రం కన్విన్సింగ్గా అనిపించలేదు.
ఈ విషయంలో పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా మాధవన్ ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేయగా.. ఒక నెటిజన్ దాని గురించి ప్రస్తావించాడు. సినిమాలో ఆంటోనీ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కన్విన్సింగ్గా లేదని, దీనిపై మీరేమంటారని అడిగాడు.
దీనికి మాధవన్ బదులిస్తూ.. ఇప్పుడు నేను కేవలం క్షమాపణ మాత్రమే చెప్పగను అన్నాడు. నిశ్శబ్దం కథ నచ్చి చేశారా, ఈ సినిమాలో నటించాలని నటించారా అని అడిగితే.. కొన్నిసార్లు సినిమాలు ఆడతాయి, కొన్నిసార్లు ఆడవు.. మా వంతు కృషి మేం చేశాం అంటూ నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు మాధవన్.
నిశ్శబ్దం సినిమా విడుదల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావడం చికాకు పెట్టిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు మాధవన్. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్సే ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమాలో పాజిటివ్ రోల్లో చూడబోతున్నారని బదులిచ్చాడతను. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు మాధవన్ చెప్పాడు.
This post was last modified on October 10, 2020 8:54 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…