తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా నిశ్శబ్దం. కానీ ఆ చిత్రం ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ నెల 2న అమేజాన్ ప్రైమ్లో రిలీజైన నిశ్శబ్దం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయిన విషయం మాధవన్ పాత్రను సైకోలా చూపించడం. ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకులకు ఎంతమాత్రం కన్విన్సింగ్గా అనిపించలేదు.
ఈ విషయంలో పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా మాధవన్ ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేయగా.. ఒక నెటిజన్ దాని గురించి ప్రస్తావించాడు. సినిమాలో ఆంటోనీ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కన్విన్సింగ్గా లేదని, దీనిపై మీరేమంటారని అడిగాడు.
దీనికి మాధవన్ బదులిస్తూ.. ఇప్పుడు నేను కేవలం క్షమాపణ మాత్రమే చెప్పగను అన్నాడు. నిశ్శబ్దం కథ నచ్చి చేశారా, ఈ సినిమాలో నటించాలని నటించారా అని అడిగితే.. కొన్నిసార్లు సినిమాలు ఆడతాయి, కొన్నిసార్లు ఆడవు.. మా వంతు కృషి మేం చేశాం అంటూ నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు మాధవన్.
నిశ్శబ్దం సినిమా విడుదల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావడం చికాకు పెట్టిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు మాధవన్. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్సే ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమాలో పాజిటివ్ రోల్లో చూడబోతున్నారని బదులిచ్చాడతను. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు మాధవన్ చెప్పాడు.
This post was last modified on October 10, 2020 8:54 am
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…