ఇండియన్ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన అమితాబ్ బచ్చన్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్నారు. ‘మనం’లో క్యామియో తరహా రోల్ చేసిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’లో కీలకమైన పాత్రలోనే కనిపించారు. ఐతే ఆయన చేసిన రెండో పాత్ర మరీ పెద్దదేమీ కాదు. దాన్ని అతిథి పాత్రగానే చెప్పుకోవచ్చు.
ఇప్పుడాయన ప్రభాస్-నాగ్ అశ్విన్ల సినిమాలో నటించబోతున్నట్లు అప్డేట్ బయటికి వచ్చింది. మరి ఆ పాత్ర నిడివి ఎంత ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అది అతిథి పాత్రా.. లేక స్పెషల్ రోలా అని చర్చించుకుంటున్నారు. ఐతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. అమితాబ్ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అతను వెల్లడించాడు. అంతే కాక మరో కీలకమైన విషయాన్ని అతను బయటపెట్టాడు.
ఈ సినిమా స్క్రిప్టు ఫస్ట్ డ్రాఫ్ట్లో అనుకున్న వర్కింగ్ టైటిల్.. అమితాబ్ చేయబోయే పాత్ర పేరే అని నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఐతే ఇప్పుడా టైటిల్ను కొనసాగిస్తున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. బిగ్-బి పాత్ర పేరునే సినిమా టైటిల్గా పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే ఆయనది హీరోతో సమానమైన పాత్రగా భావించవచ్చు.
ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే కూడా భాగమైన సంగతి తెలిసిందే. అమితాబ్ కూడా రావడంతో ఇది ట్రూ పాన్ ఇండియన్ సినిమా అయింది. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లకు పైగానే అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on October 10, 2020 11:30 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావడం అన్నది రేర్ ఫీట్. తెలుగులో ఈ రికార్డు నందమూరి…
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…