ఇండియన్ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన అమితాబ్ బచ్చన్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్నారు. ‘మనం’లో క్యామియో తరహా రోల్ చేసిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’లో కీలకమైన పాత్రలోనే కనిపించారు. ఐతే ఆయన చేసిన రెండో పాత్ర మరీ పెద్దదేమీ కాదు. దాన్ని అతిథి పాత్రగానే చెప్పుకోవచ్చు.
ఇప్పుడాయన ప్రభాస్-నాగ్ అశ్విన్ల సినిమాలో నటించబోతున్నట్లు అప్డేట్ బయటికి వచ్చింది. మరి ఆ పాత్ర నిడివి ఎంత ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అది అతిథి పాత్రా.. లేక స్పెషల్ రోలా అని చర్చించుకుంటున్నారు. ఐతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. అమితాబ్ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అతను వెల్లడించాడు. అంతే కాక మరో కీలకమైన విషయాన్ని అతను బయటపెట్టాడు.
ఈ సినిమా స్క్రిప్టు ఫస్ట్ డ్రాఫ్ట్లో అనుకున్న వర్కింగ్ టైటిల్.. అమితాబ్ చేయబోయే పాత్ర పేరే అని నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఐతే ఇప్పుడా టైటిల్ను కొనసాగిస్తున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. బిగ్-బి పాత్ర పేరునే సినిమా టైటిల్గా పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే ఆయనది హీరోతో సమానమైన పాత్రగా భావించవచ్చు.
ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే కూడా భాగమైన సంగతి తెలిసిందే. అమితాబ్ కూడా రావడంతో ఇది ట్రూ పాన్ ఇండియన్ సినిమా అయింది. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర బడ్జెట్ రూ.400 కోట్లకు పైగానే అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…