సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరి సినిమా ‘రుద్రమదేవి’ విడుదలై సరిగ్గా ఐదేళ్లవుతోంది. ఒక సినిమా మంచి విజయం సాధించాక దాని దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘రుద్రమదేవి’తో పెద్ద రిస్కే చేసి ఎలాగోలా బయటపడ్డ గుణ.. ఆ తర్వాత కూడా మరో సాహసోపేత ప్రాజెక్టునే నెత్తికెత్తుకున్నాడు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో అత్యంత కీలకమైన హిరణ్యకశ్యపుడి పాత్రనే ప్రధానంగా చేసుకుని ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేశాడు.
ప్రధాన పాత్రకు రానాను ఎంచుకోవడమే కాదు.. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు సురేష్ బాబును ఒప్పించాడు కూడా. కరోనాకు ముందు అయితే ఈ సినిమా పట్ల సురేష్ బాబు ఆసక్తితోనే కనిపించాడు. ఆర్థిక వనరులు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు.
కానీ కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా ఒక ప్రకటన చేశాడు.
భారీతనంతో కూడుకున్న హిరణ్యకశ్యప చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనంతా పూర్తయినప్పటికీ.. కరోనా పరిస్థితుల వల్ల అది పట్టాలెక్కడం ఆలస్యమవుతోందని.. అందుకే దీని కంటే ముందు తాను వేరే సినిమా చేయబోతున్నానని.. దాని గురించి అప్డేట్ రాబోతోందని ట్విట్టర్లో ప్రకటించాడు. ‘హిరణ్యకశ్యప’ ఆలస్యం అవుతోందని గుణ అంటున్నప్పటికీ.. అసలు ఆ సినిమా పట్టాలెక్కడమే కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
This post was last modified on October 9, 2020 3:04 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…