Movie News

‘హిరణ్యకశ్యప’ అటకెక్కినట్లేనా?

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరి సినిమా ‘రుద్రమదేవి’ విడుదలై సరిగ్గా ఐదేళ్లవుతోంది. ఒక సినిమా మంచి విజయం సాధించాక దాని దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘రుద్రమదేవి’తో పెద్ద రిస్కే చేసి ఎలాగోలా బయటపడ్డ గుణ.. ఆ తర్వాత కూడా మరో సాహసోపేత ప్రాజెక్టునే నెత్తికెత్తుకున్నాడు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో అత్యంత కీలకమైన హిరణ్యకశ్యపుడి పాత్రనే ప్రధానంగా చేసుకుని ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేశాడు.

ప్రధాన పాత్రకు రానాను ఎంచుకోవడమే కాదు.. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు సురేష్ బాబును ఒప్పించాడు కూడా. కరోనాకు ముందు అయితే ఈ సినిమా పట్ల సురేష్ బాబు ఆసక్తితోనే కనిపించాడు. ఆర్థిక వనరులు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు.

కానీ కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా ఒక ప్రకటన చేశాడు.

భారీతనంతో కూడుకున్న హిరణ్యకశ్యప చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనంతా పూర్తయినప్పటికీ.. కరోనా పరిస్థితుల వల్ల అది పట్టాలెక్కడం ఆలస్యమవుతోందని.. అందుకే దీని కంటే ముందు తాను వేరే సినిమా చేయబోతున్నానని.. దాని గురించి అప్‌డేట్ రాబోతోందని ట్విట్టర్లో ప్రకటించాడు. ‘హిరణ్యకశ్యప’ ఆలస్యం అవుతోందని గుణ అంటున్నప్పటికీ.. అసలు ఆ సినిమా పట్టాలెక్కడమే కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.

This post was last modified on October 9, 2020 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

26 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago