సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరి సినిమా ‘రుద్రమదేవి’ విడుదలై సరిగ్గా ఐదేళ్లవుతోంది. ఒక సినిమా మంచి విజయం సాధించాక దాని దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘రుద్రమదేవి’తో పెద్ద రిస్కే చేసి ఎలాగోలా బయటపడ్డ గుణ.. ఆ తర్వాత కూడా మరో సాహసోపేత ప్రాజెక్టునే నెత్తికెత్తుకున్నాడు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో అత్యంత కీలకమైన హిరణ్యకశ్యపుడి పాత్రనే ప్రధానంగా చేసుకుని ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేశాడు.
ప్రధాన పాత్రకు రానాను ఎంచుకోవడమే కాదు.. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు సురేష్ బాబును ఒప్పించాడు కూడా. కరోనాకు ముందు అయితే ఈ సినిమా పట్ల సురేష్ బాబు ఆసక్తితోనే కనిపించాడు. ఆర్థిక వనరులు కూడగట్టే ప్రయత్నం కూడా చేశారు.
కానీ కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా ఒక ప్రకటన చేశాడు.
భారీతనంతో కూడుకున్న హిరణ్యకశ్యప చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనంతా పూర్తయినప్పటికీ.. కరోనా పరిస్థితుల వల్ల అది పట్టాలెక్కడం ఆలస్యమవుతోందని.. అందుకే దీని కంటే ముందు తాను వేరే సినిమా చేయబోతున్నానని.. దాని గురించి అప్డేట్ రాబోతోందని ట్విట్టర్లో ప్రకటించాడు. ‘హిరణ్యకశ్యప’ ఆలస్యం అవుతోందని గుణ అంటున్నప్పటికీ.. అసలు ఆ సినిమా పట్టాలెక్కడమే కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
This post was last modified on October 9, 2020 3:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…