Movie News

ఆ ఛానెల్ పని పట్టబోతున్న రియా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతికి రియా చక్రవర్తి ఎంత వరకు బాధ్యురాలో ఏమో కానీ.. ఓ వర్గం మీడియా మాత్రం ఆమెపై నీలాప నిందలు వేసింది. సుశాంత్ జీవితాన్ని ఆమె సర్వనాశనం చేసిందంటూ కథనాలు ప్రసారం చేసింది. పోలీసుల విచారణ మొదలు కాకముందే ఆమెను దోషిగా తేల్చేసింది. ముఖ్యంగా అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ.. రియాను ఎలా టార్గెట్ చేసిందో అందరూ చూశారు.

మిగతా అన్ని వార్తలూ పక్కన పెట్టేసి రెండు మూడు నెలల పాటు సుశాంత్ ఇష్యూనే నెత్తికెత్తుకున్న ఆ ఛానెల్ రియాను మరీ దారుణంగా టార్గెట్ చేసిందనే అభిప్రాయం అందరిలో కలిగింది. ముందు సుశాంత్ మృతి విషయంలో ఆమెపై నిందలేసిన ఆ ఛానెల్.. ఆ తర్వాత డ్రగ్స్ విషయంలోనూ ఆమెను టార్గెట్ చేసింది. ముందు రియా మీద వ్యతిరేకతతో ఉన్న వాళ్లు సైతం ఆమె మీద జాలిపడే స్థాయిలో ఆమెపై నెగెటివ్ క్యాంపైనింగ్ నడిచింది.

ఐతే డ్రగ్స్ కేసులో బెయిల్ రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీ నుంచి ఎట్టకేలకు బయటికి వచ్చిన రియా.. నేరుగా రిపబ్లిక్ టీవీని ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఆ ఛానెల్ మీద పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. సుశాంత్ మృతికి రియానే కారణమని అదే పనిగా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనాల తాలూకు రియా టీం సేకరించిందట.
సుశాంత్‌ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యులు నిర్ధరించడం.. అతడి మృతికి సంబంధించి ఎవరి మీదా సందేహాలు లేవని, అతడిది ఆత్మహత్యే అని సీబీఐ సైతం తుది నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అదే నిజమైతే తన మీద చేసిన ఆరోపణలు, ప్రసారం చేసిన నెగెటివ్ వార్తలపై ప్రశ్నలు సంధిస్తూ అర్నాబ్ అండ్ టీంకు నోటీసులు ఇవ్వబోతోందట రియా. తనపై డ్రగ్స్ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఇంత తేలిగ్గా వదలకూడదని.. రిపబ్లిక్ టీవీ నోరు మూయించాలని ఆమె పట్టుదలతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

This post was last modified on October 9, 2020 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago