రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం ‘పుష్ప-2’ జాతర నడుస్తోంది. రికార్డు స్థాయిలో రిలీజైన ఈ సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కానీ హైదరాబాద్లో ఐకానిక్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్లో ‘పుష్ప-2’ సందడి లేదు. పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా రౌండ్ ద క్లాక్ షోలు నడిచే ప్రసాద్స్ ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమా ఆడక వెలవెలబోతోంది. ఇది ప్రసాద్స్ వాళ్లకు, అలాగే ప్రేక్షకులకు బాధ కలిగించే విషయం.
కొంచెం లేటుగా అయినా ప్రసాద్స్లో పుష్ప-2 షోలు పడతాయని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. ఈ రోజు పాత సినిమాలనే నడిపిస్తోంది ప్రసాద్స్. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. రెవెన్యూ షేరింగ్ విషయంలో మైత్రీ అధినేతలతో తలెత్తిన గొడవే ప్రసాద్స్లో షోలు పడకపోవడానికి కారణమని తెలిసింది.పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్, ఏషియన్ ఈ సంస్థలన్నీ డిస్ట్రిబ్యూటర్కు 55 శాతం ఆదాయాన్ని పంచుతున్నాయి.
అంటే టికెట్ల అమ్మకాల ద్వారా వంద రూపాయలు వస్తే అందులో 45 రూపాయలు థియేటర్కు వెళ్తాయి. 55 రూపాయలు డిస్ట్రిబ్యూటర్కు వెళ్తాయి. ఐతే ప్రసాద్స్ ఎప్పట్నుంచో నార్మల్ స్క్రీన్స్ నుంచి 52.5 శాతం, బిగ్ స్క్రీన్ నుంచి 50 శాతం డిస్ట్రిబ్యూటర్కు ఇస్తోంది. మిగతా మల్టీప్లెక్సులతో పోలిస్తే ఇక్కడ స్నాక్స్ సహా అన్నీ తక్కువ ధరకు లభిస్తాయి. సిటీ మధ్యలో సినీ గోయర్స్ను బాగా ఆకర్షించే మల్టీప్లెక్స్ ఇది. ఇండస్ట్రీ వాళ్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. చాలా వరకు సినిమాల ఫస్ట్ షోలు ఇక్కడే పడుతుంటాయి. ప్రిమియర్స్, ప్రెస్ షోలకు కూడా ఇదే వేదిక.
ఐతే ‘పుష్ప-2’ను నైజాంలో సొంతంగా రిలీజ్ చేసిన ‘మైత్రీ’ అధినేతలు మిగతా మల్టీప్లెక్సుల్లాగే 55 శాతం రెవెన్యూ ఇవ్వాలని పట్టుబట్టారు. ఐతే ఈ ఒక్క సినిమాకు ఒప్పుకుంటే తర్వాత కూడా అన్ని చిత్రాలకూ అదే రెవెన్యూ షేరింగ్ మోడల్ కొనసాగించాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ప్రసాద్స్ యాజమాన్యం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో పీటముడి బిగుసుకుని సమస్య ఎంతకీ పరిష్కారం కాలేదు. ఇరు వర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో ప్రసాద్స్లో ‘పుష్ప-2’ షోలు పడలేదు.
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…