రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం ‘పుష్ప-2’ జాతర నడుస్తోంది. రికార్డు స్థాయిలో రిలీజైన ఈ సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. కానీ హైదరాబాద్లో ఐకానిక్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్లో ‘పుష్ప-2’ సందడి లేదు. పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా రౌండ్ ద క్లాక్ షోలు నడిచే ప్రసాద్స్ ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమా ఆడక వెలవెలబోతోంది. ఇది ప్రసాద్స్ వాళ్లకు, అలాగే ప్రేక్షకులకు బాధ కలిగించే విషయం.
కొంచెం లేటుగా అయినా ప్రసాద్స్లో పుష్ప-2 షోలు పడతాయని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. ఈ రోజు పాత సినిమాలనే నడిపిస్తోంది ప్రసాద్స్. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. రెవెన్యూ షేరింగ్ విషయంలో మైత్రీ అధినేతలతో తలెత్తిన గొడవే ప్రసాద్స్లో షోలు పడకపోవడానికి కారణమని తెలిసింది.పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్, ఏషియన్ ఈ సంస్థలన్నీ డిస్ట్రిబ్యూటర్కు 55 శాతం ఆదాయాన్ని పంచుతున్నాయి.
అంటే టికెట్ల అమ్మకాల ద్వారా వంద రూపాయలు వస్తే అందులో 45 రూపాయలు థియేటర్కు వెళ్తాయి. 55 రూపాయలు డిస్ట్రిబ్యూటర్కు వెళ్తాయి. ఐతే ప్రసాద్స్ ఎప్పట్నుంచో నార్మల్ స్క్రీన్స్ నుంచి 52.5 శాతం, బిగ్ స్క్రీన్ నుంచి 50 శాతం డిస్ట్రిబ్యూటర్కు ఇస్తోంది. మిగతా మల్టీప్లెక్సులతో పోలిస్తే ఇక్కడ స్నాక్స్ సహా అన్నీ తక్కువ ధరకు లభిస్తాయి. సిటీ మధ్యలో సినీ గోయర్స్ను బాగా ఆకర్షించే మల్టీప్లెక్స్ ఇది. ఇండస్ట్రీ వాళ్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. చాలా వరకు సినిమాల ఫస్ట్ షోలు ఇక్కడే పడుతుంటాయి. ప్రిమియర్స్, ప్రెస్ షోలకు కూడా ఇదే వేదిక.
ఐతే ‘పుష్ప-2’ను నైజాంలో సొంతంగా రిలీజ్ చేసిన ‘మైత్రీ’ అధినేతలు మిగతా మల్టీప్లెక్సుల్లాగే 55 శాతం రెవెన్యూ ఇవ్వాలని పట్టుబట్టారు. ఐతే ఈ ఒక్క సినిమాకు ఒప్పుకుంటే తర్వాత కూడా అన్ని చిత్రాలకూ అదే రెవెన్యూ షేరింగ్ మోడల్ కొనసాగించాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ప్రసాద్స్ యాజమాన్యం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో పీటముడి బిగుసుకుని సమస్య ఎంతకీ పరిష్కారం కాలేదు. ఇరు వర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో ప్రసాద్స్లో ‘పుష్ప-2’ షోలు పడలేదు.
This post was last modified on December 5, 2024 8:57 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…