‘పుష్ప 1 ది రైజ్’ లో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నకు తగిన ప్రాధాన్యం దక్కినప్పటికీ కథ పరంగా ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ ఎక్కువ దొరకలేదు. అందుకే నా సామి నా సామీ లాంటి పాటలు హైలైటయ్యాయి. అయితే ‘పుష్ప 2 ది రూల్’ లో అలా ఉండదని, పెర్ఫార్మన్స్ గొప్పగా చూపించుకునే అవకాశం ఇందులో ఉందని రష్మిక పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కానీ అదెంత వరకు నిజమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా డౌట్ అలాగే ఉండిపోయింది. అల్లు అర్జున్ తో కెమిస్ట్రీని పండించడం, సూపర్ గా డాన్స్ చేయడం తప్ప అప్పటిదాకా గొప్పగా చెప్పుకునేది లేదు.
కానీ సెకండాఫ్ లో సీన్ మారిపోయింది. జాతరలో పాట, ఫైట్ ఎపిసోడ్ అయిపోయాక మొగుడిని అవమానించిన వాళ్ళకు క్లాసు పీకే సన్నివేశంలో రష్మిక మందన్న ఏకంగా బన్నీనే సైడయ్యేలా డామినేట్ చేసింది. ఇలా డిజైన్ చేసిన క్రెడిట్ సుకుమార్ కే దక్కుతుంది కానీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న శ్రీవల్లి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో నరసింహనాయుడులో బాలయ్య అన్నలకు సిమ్రాన్ వార్నింగ్ ఇచ్చే సీన్ థియేటర్లను షేక్ చేసింది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఎవరికీ దక్కలేదు. ఇన్నేళ్ల తర్వాత రష్మిక మందన్న ఆ స్థాయిలో అదరగొట్టేసి చప్పట్లు కొట్టించుకుంది.
యానిమల్ లో రన్బీర్ కపూర్ లాంటి వయొలెంట్ యాక్టర్ కి ధీటుగా పెర్ఫార్మ్ చేసిన రష్మిక మందన్న ఇప్పుడు స్క్రీన్ మొత్తాన్ని తినేసే పుష్పరాజ్ ని మరిపించేలా నటించడం మరో మైలురాయిని జోడించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్ లో ఒక షాట్ చూసి ప్రచారం జరిగినట్టు తన పాత్రకు ఎలాంటి ట్విస్టు ఇచ్చి అభిమానులను బాధ పెట్టలేదు. పీలింగ్స్ సాంగ్ సైతం ఓ రేంజ్ లో పేలింది. ఒకవేళ పుష్ప 1 లాగే పరిమితంగా ఉంటే ఏమయ్యేదో కానీ పుష్ప 2 పుణ్యమాని ఉత్తరాది ప్రేక్షకులు యానిమల్ తర్వాత మరింతగా రష్మికతో కనెక్ట్ అవ్వడానికి స్కోప్ దక్కింది. ఇదంతా నెక్స్ట్ రిలీజ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ కు ఉపయోగపడేదే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…