`సీజ్ ది షిప్` – గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు యువతలోనూ జోరుగా ఈ డైలాగ్ వినిపిస్తోంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్య అక్రమాలను నిలువరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా కాకినాడకు వెళ్లిన ఆయన.. మంత్రినాదెండ్ల మనోహర్తో కలిసి కాకినాడ పోర్టును సందర్శించారు. ఈ సమయంలో పోర్టుకు 10 మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న విదేశీ షిప్పును ఆయన పరిశీలించారు.
ఈ సమయంలో పవన్ను అధికారులు అడ్డగించడం.. కాకినాడ ఎస్పీ సెలవుపై వెళ్లడం.. పవన్ను షిప్ వద్దకు తీసుకువెళ్లకుండా అధికారులు జాప్యం చేయడం వంటివి తీవ్ర ఆందోళనకు రాజకీయ వివాదానికి కూడా గురి చేశాయి. అయినప్పటికీ.. పవన్ సదరు విదేశీ షిప్పు వద్దకు చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యంలో రేషన్ సరుకు కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన “సీజ్ ది షిప్“ అంటూ సదరు విదేశీ షిప్పును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత.. మీడియా మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటి వరకు జరిగిన సంగతులను వివరించారు.
ఇదిలావుంటే.. పవన్ చేసిన “సీజ్ ది షిప్“ వ్యాఖ్య జోరుగా వైరల్ అయింది. ఆయన అభిమానులు సహా.. జనసేన పార్టీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు కూడా ఈ డైలాగ్ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై భిన్నమైన వాదనలు వచ్చినా.. ఈ డైలాగ్ అయితే.. పాపులర్ అయింది. గతంలో `మనల్నెవడ్రా ఆపేది` తరహాలో ఈ `సీజ్ ది షిప్` డైలాగ్ కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే డైలాగుతో తాజాగా ఓ తెలుగు సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది.
`ఆర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ` నిర్మాణ సంస్థ `సీజ్ ది షిప్` పేరుతో సినిమా టైటిల్ను రిజిస్టర్ చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు రూ.1100 చెల్లించి.. ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకుంది. ఈ టైటిల్పై సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ కాలపరిమితి ఏడాది పాటు ఉంటుంది. ఏడాదిలోగా సినిమా నిర్మాణం ప్రారంభించి ఛాంబర్కు తెలియజేస్తే.. టైటిల్ గడువును సినిమా పూర్తయ్యే వరకు పొడిగిస్తారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on December 4, 2024 7:30 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…