`సీజ్ ది షిప్` – గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు యువతలోనూ జోరుగా ఈ డైలాగ్ వినిపిస్తోంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్య అక్రమాలను నిలువరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా కాకినాడకు వెళ్లిన ఆయన.. మంత్రినాదెండ్ల మనోహర్తో కలిసి కాకినాడ పోర్టును సందర్శించారు. ఈ సమయంలో పోర్టుకు 10 మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న విదేశీ షిప్పును ఆయన పరిశీలించారు.
ఈ సమయంలో పవన్ను అధికారులు అడ్డగించడం.. కాకినాడ ఎస్పీ సెలవుపై వెళ్లడం.. పవన్ను షిప్ వద్దకు తీసుకువెళ్లకుండా అధికారులు జాప్యం చేయడం వంటివి తీవ్ర ఆందోళనకు రాజకీయ వివాదానికి కూడా గురి చేశాయి. అయినప్పటికీ.. పవన్ సదరు విదేశీ షిప్పు వద్దకు చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యంలో రేషన్ సరుకు కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన “సీజ్ ది షిప్“ అంటూ సదరు విదేశీ షిప్పును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత.. మీడియా మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటి వరకు జరిగిన సంగతులను వివరించారు.
ఇదిలావుంటే.. పవన్ చేసిన “సీజ్ ది షిప్“ వ్యాఖ్య జోరుగా వైరల్ అయింది. ఆయన అభిమానులు సహా.. జనసేన పార్టీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు కూడా ఈ డైలాగ్ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై భిన్నమైన వాదనలు వచ్చినా.. ఈ డైలాగ్ అయితే.. పాపులర్ అయింది. గతంలో `మనల్నెవడ్రా ఆపేది` తరహాలో ఈ `సీజ్ ది షిప్` డైలాగ్ కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే డైలాగుతో తాజాగా ఓ తెలుగు సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది.
`ఆర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ` నిర్మాణ సంస్థ `సీజ్ ది షిప్` పేరుతో సినిమా టైటిల్ను రిజిస్టర్ చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు రూ.1100 చెల్లించి.. ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకుంది. ఈ టైటిల్పై సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ కాలపరిమితి ఏడాది పాటు ఉంటుంది. ఏడాదిలోగా సినిమా నిర్మాణం ప్రారంభించి ఛాంబర్కు తెలియజేస్తే.. టైటిల్ గడువును సినిమా పూర్తయ్యే వరకు పొడిగిస్తారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on December 4, 2024 7:30 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…