మహేష్, త్రివిక్రమ్ ఒకప్పుడు మంచి స్నేహితులే కానీ మధ్యలో చిన్నపాటి విబేధాలు వచ్చాయి. దాంతో పదేళ్లుగా ఈ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. అయితే సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరనేది తెలిసిన విషయమే. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య ప్యాచప్ జరిగిపోయింది. మళ్లీ త్రివిక్రమ్తో సినిమా చేయాలనే ఆకాంక్షను మహేష్ వెలిబుచ్చగా, అతనికో కథ చెప్పిన త్రివిక్రమ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ పొందాడు. అయితే ఎన్టీఆర్తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కమిట్ అయి వుండడంతో ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.
త్రివిక్రమ్ ఇప్పుడున్న రేంజ్కి అతడిని లాక్ చేయడానికి మహేష్ తెలివిగా వ్యవహరించాడు. ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని వెలిబుచ్చుతూ త్రివిక్రమ్తో అతి త్వరలో సినిమా వుంటుందని ప్రకటించాడు. దీంతో అధికారికంగా త్రివిక్రమ్ ఈ సినిమాకు లాక్ అయినట్టయింది. ఎన్టీఆర్తో సినిమా ముందు చేస్తాడో, తర్వాత చేస్తాడో తెలియదు కానీ ఇతర కమిట్మెంట్స్ ఏమీ లేకుండా త్రివిక్రమ్ తన సినిమాకు కట్టుబడేలా మహేష్ ఈ ప్రకటన ఇచ్చాడు. సూపర్స్టార్ స్వయంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఇక ఎవరైనా ఎలా వెనకడుగు వేయగలరు?
This post was last modified on October 8, 2020 3:16 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…