ఒక్క అక్షరంని టైటిల్ గా పెట్టడం, తన పేరునే సినిమాగా తీయడం ఒక్క ఉపేంద్రకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్లు, A బ్లాక్ బస్టర్ అయినా, ఓం కన్నడలో అయిదువందల సార్లు రీ రిలీజ్ చేసినా దాని వెనుక ఆయన క్రేజీ ఆలోచనలే కారణం. తెలుగులోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడంటే సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో గుర్తిస్తారు కానీ ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే అప్పట్లోనే అలా ఎలా ఆలోచించాడా అనిపిస్తుంది. నయనతారతో జోడిగా చేసిన సూపర్ సింబల్ మూవీలోనూ ఉపేంద్ర మార్కు బలంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం.
ఈ నెల 20న ఉప్పి కొత్త సినిమా యుఐ విడుదలకు రెడీ అవుతోంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండదని అభిమానులు ముందే ప్రిపేరయ్యారు కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా ఉపేంద్ర నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఏదో ఇవ్వబోతున్నాడు. ఇవాళ వార్నర్ పేరుతో రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఒకటి విడుదల చేశారు. 2040 సంవత్సరంలో మనిషి కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, గింజ మెతుకు కోసం కొట్టుకు చచ్చే పరిస్థితుల్లో టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత నాశనం చేయబోతోందనే చిన్న శాంపిల్ ఇందులో వదిలారు. అధికారం ఉంటే ఎలాంటి ధిక్కారాలు పని చేయవనే సందేశం ఇచ్చారు.
ఒకరకంగా చెప్పాలంటే ఉపేంద్ర చేస్తోంది పెద్ద సాహసం. స్వీయ దర్శకత్వంలో ఇంత భారీ బడ్జెట్ తో రిస్క్ అనిపించే ఆలోచనను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలి. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్న ఈ వెరైటీ థ్రిల్లర్ లో ఉపేంద్ర గతంలో ఎన్నడూ చూడని గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నాడు. యుఐ చూశాక ఆడియన్స్ ఆలోచనా విధానం మారిపోతుందని చెప్పడం చూస్తే ఇదేదో ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. విపరీతమైన పోటీ మధ్య రిలీజవుతున్న యుఐకి తెలుగులోనూ పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు. చూడాలి ఉప్పి దాదా ఈసారి గురి తప్పకుండా ఎలా గెలుస్తాడో.
This post was last modified on December 2, 2024 12:43 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…