మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మోహన్ లాల్ చాలా ఏళ్ల నుంచి నిలకడగా ఇండస్ట్రీ హిట్లు ఇస్తున్నాడు. కొత్త రికార్డులు నెలకొల్పాలన్నా.. పాతవి బద్దలు కొట్టాలన్నా మోహన్ లాల్కే సాధ్యం మల్లూవుడ్లో. ‘దృశ్యం’ సినిమాతో మలయాళ పరిశ్రమకు తొలి 50 కోట్ల సినిమాను అందించిన ఆయనే.. ఆ తర్వాత ‘పులి మురుగన్’తో వంద కోట్ల క్లబ్బునూ పరిచయం చేశాడు. కొన్నేళ్లకు ‘లూసిఫర్’తో ఆ సినిమా వసూళ్లనూ దాటేశాడు. ఆపై 2018, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు ఈ రికార్డును అధిగమించాయి. ప్రస్తుత రికార్డు ‘మంజుమ్మల్ బాయ్స్’ పేరిటే ఉంది. దాన్ని అధిగమించడం లాల్కే సాధ్యం అని మలయాళ ట్రేడ్ పండిట్లు భావిస్తున్నారు.
అలాంటి సత్తా ఉన్న సినిమాతోనే మోహన్ లాల్ బాక్సాఫీస్ వేటకు రెడీ అవుతున్నాడు. ఆయన కొత్త చిత్రం ‘ఎల్-2: ఎంపురన్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ‘ఎల్-2: ఎంపురన్’ లాల్ చివరి బిగ్గెస్ట్ హిట్ ‘లూసిఫర్’కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. లాల్కు వీరాభిమాని అయిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మారిన తన ఆరాధ్య కథానాయకుడిని అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అతనే పార్ట్-2ను కూడా డైరెక్ట్ చేశాడు.
‘లూసిఫర్’కు కథ అందించిన నటుడు మురళీ గోపీనే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. ఒకప్పటి లాల్ డ్రైవర్, మిత్రుడు.. తర్వాత నిర్మాతగా మారి లాల్తో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లూసిఫర్’ చివర్లో చూపించిన చిన్న గ్లింప్స్తోనే ‘ఎంపురన్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ కంటే ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుందని అర్థమైంది. ‘లూసిఫర్’ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేయగా.. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
This post was last modified on December 1, 2024 4:13 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…