హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్ రేపు మిస్ యుతో థియేటర్లలో అడుగు పెట్టాల్సింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చాలా విశేషాలు పంచుకున్నాడు. పుష్ప 2 ది రూల్ కు వారం ముందు రావడం రిస్క్ కాదాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాగున్న మూవీని ఎవరూ ఆపలేరని, ఆ మాటకొస్తే అవతలి వాళ్లే భయపడతారేమో అనే రేంజ్ లో హామీ ఇచ్చాడు. కట్ చేస్తే మిస్ యు రేపు రావడం లేదు. ఈ కబురు నిన్నే పంచుకున్నారు కానీ కొన్ని డౌట్లు వదిలారు.
చెన్నైతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మిస్ యుని పోస్ట్ పోన్ చేస్తున్నామని సిద్ధార్థ్ చెప్పిన ప్రధాన కారణం. కానీ ఇప్పటిదాకా అంత తుఫాను వచ్చే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. రేపు షెడ్యూల్ చేసుకున్న ఇతర సినిమాలు యధావిధిగా వస్తున్నాయి. సరే వాన రాకడ, బంధువుల పోకడ ఎవరూ చెప్పేది కాదు కానీ పుష్ప 2 మేనియా చూసే మిస్ యు టీమ్ వెనుకడుగు వేసిందానే అనుమానం రాక మానదు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బన్నీ మూవీకి భారీ రిలీజ్ దక్కుతోంది. అలాంటప్పుడు రెండో వారంలో మిస్ యు కనిపించడం కష్టం.
ఒకవేళ నిజంగా వర్షాలు పడే పనైతే కనక గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా రెండు దెబ్బలు తగిలించుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ లవ్ కం రొమాంటిక్ డ్రామాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. దీని మీద అంతగా బజ్ లేని నేపథ్యంలో ప్రమోషన్లకు మరింత టైం దొరకడం మంచిదే. అయితే డిసెంబర్ 20 నుంచి 25 దాకా ఏకంగా పన్నెండు సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్న నేపథ్యంలో మిస్ యుకి ఎలాంటి డేట్ సెట్ చేసుకుంటారో చూడాలి. పుష్ప 2 టాక్ చూసి నిర్ణయం తీసుకుంటారేమో.
This post was last modified on November 28, 2024 5:23 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…